శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానం – కోట సింహద్వారం నుండి అక్కడికి – సారస్వత సభకుచేరడమంటే మాటలా!?
ద్వారపాలకులు ముందే బల్లాలను` X `వలె అడ్డం పెట్టేస్తారు కదా.
కొలువులోని ఉద్యోగులు, సిబ్బంది – ఈ వర్ధమాన కవిగారికి తెలీదు.
తాతాచార్యుల వారి ముద్ర వీపు తప్పినా వీపుకు తప్పదు – ఇత్యాది సామెతలకు హేతువు ఐన తాతాచార్యులు – ఆస్థాన కవులలో స్థిర స్థానం పొందిన కవి – అని అర్ధం ఔతూనే ఉన్నది కదా!
@@@@@@
శ్రీకృష్ణదేవరాయల వారి భువనవిజయం – ప్రాంగణంలో ఈశాన్య దిశలో ఉన్న పీఠంపై కందుకూరి రుద్రకవి ఆసీనుడయ్యాడు. ఆ కుర్చీలో కూర్చునే అర్హత సంపాదించడానికి అతడు ఎన్నో అడ్డంకిలను, ఇక్కట్లను అధిగమించి రాగలిగాడు.
ఎలాగైతేనేం, కొసకు – శ్రీకృష్ణదేవరాయల వారి క్షురకుడు –
కందుకూరి రుద్రకవికి హామీ ఇచ్చాడు,
” మీకు సార్వభౌముల దర్శనం లభించడానికి, నాకు చేతనైనంత సాయం చేస్తాను.”
ఈ చిన్న మాట కందుకూరి రుద్రకవి కన్నులను ఆనందాశ్రువులతో నింపింది.
స్నేహహస్తం అందించిన ఆ రాయల వారి మంగలి పేరు కొండోజీ.
కందుకూరి రుద్రకవికి తటస్థపడిన ఈ వృత్తికారుడు మంగలి తిమ్మోజు కొండోజీ –
నివాసం బాడవి పట్టణం.
శ్రీకృష్ణదేవరాయలవారి తర్వాతి రాజ్య పాలకులు సదాశివ రాయలుకు, అళియ రామరాయలు.
1542 నుండి 1565 వరకూ పాలించిన సదాశివ రాయలుకు, అళియ రామరాయలు లకు కూడా – సాన్నిహిత్య సేవకుడు.
కేవలం మంగలి పని నిర్వహణయే కాక, ప్రభువులకు మంచి సలహాలు ఇచ్చే చురుకుదనం, ఇంగితజ్ఞానం ఉన్న వ్యక్తి, కనుకనే – మహా రాజులకు సఖ్యత ఉన్న భృత్యుడు అయ్యాడు కొండోజీ.
కొండోజీకి బహుమతులుగా ఇచ్చిన భూములు, కానుకల వివరముల గురించిన దాన శాసనాలు ఈ విషయానికి ఆనవాళ్ళు.
తనకు వీలు ఉన్నంతలో నలుగురికీ సాయపడే గుణం కలిగి ఉన్న మనిషి కొండోజీ, అందుచేతనే – కందుకూరి రుద్రకవి –
“మంగలి కొండోజి మేలు మంత్రుల కంటెన్.” అని పద్యాన్ని చెప్పాడు కవి.
కందుకూరి రుద్రకవి – నుడివిన పద్య పంక్తి కాస్తా – లోకోక్తి ముక్తావళి గా మారింది.
***********************************************