ఓ సౌభాగ్యలక్ష్మి ! నీ పాద పద్మములను శరణుబొంది నీయందు శేష భావత్వమున నిలిపి ఇతర ఉపాయములను వీడి, ఓ తల్లీ నేను సంసారమును తరింతును.
ఓ సౌభాగ్యలక్ష్మి ! ఓ సార్వభౌమిని ! మాయందు దయయుంచి ప్రసన్నురాలవు గమ్ము, భక్తులు నిన్ను శరణని, నీయందు భక్తి ప్రపత్తులు కలవారై నిన్ను శరణు బొంది నిన్నే చింతించుచూ, నీవే, వారికి దిక్కుయని పలుకుచు నిన్ను సేవించుచున్నారు.
సకల లోకములకు సుఖము నిచ్చు ఓ తల్లి, అధికురాల ! బ్రహ్మ రుద్రాది మరుద్గణములు నిన్నే సేవించు చున్నరు ప్రసన్నురాలవు గమ్ము !
ఓ సౌభాగ్యలక్ష్మి ! మిక్కిలి అతిశయించిన గుణములు కలదానా ! మహావిష్ణుప్రణయ మునకు ఆలంబమయినదానా ! వేదవేదాన్తముల ప్రకాశించు దానా ! ఓ నిత్యాన్నదాత్రి ! ప్రసన్నరాలవు గమ్ము.
ఓ సౌభాగ్యలక్ష్మి ! ఆదిభౌతిక – ఆది దైవిక – ఆథ్యాత్మిక ములనే, తాపత్రయములను నశింప జేసి, ఈ జన్మకు తృప్తినిచ్చి నా దేహయాత్రను ఆ పరాత్పరుని దిశకు మళ్ళించుము.
ఓ సౌభాగ్యలక్ష్మి ! జగద్గురువైన యతిరాజ రామానుజులు, ఆ కరుణా సముద్రులు ద్రావిడ ఆమ్నాయముల యందు ప్రశంసించబడిన నీ మంగళ గుణము లను పలుమార్లు ఉచ్చరించి ప్రకాశించినారు.
ఓ సౌభాగ్యలక్ష్మి ! నిన్ను కీర్తించుటకు, నిన్నే చింతించు టకు, నీ దివ్య గుణగానమును జేయుటకు నీ ముఖాంభోజమును దర్శించుటకు నాకు దివ్యమైన మనస్సునిమ్ము.
ఓ సౌభాగ్యలక్ష్మి ! యే దివ్యజ్యోతి పరమ పవిత్రమై పరమ ప్రభావోపేతమై శ్రీ వేంకటాద్రిన నిలిచిన ఆ పర దైవమే నాకు ఇహలోకమున శరణ్యము.
ఓ సౌభాగ్యలక్ష్మి ! నీవు సదా గొప్ప వారి మనస్సులతో సుగుణవంతుల హృదయములలో సజ్జనుల గృహములలో నివసింతువు కదా !
ఓ సౌభాగ్యలక్ష్మి ! వేదాన్త దేశికులను మహాకవి నీ శరణాగతిని ప్రశంసించు బృహద్కావ్యమును వ్రాసి జగద్గురు త్వమున గాంచిరి. ఆహా ! ఏమి నీ స్తుతి మహత్మ్యము.
ఓ సౌభాగ్యలక్ష్మి ! ఓ వైకుంఠనాధుని ప్రియురాలా ! నీ చూపు మాపై క్షణము ప్రసరించిన మా మనస్సు వికసించును, ఈ భూతల వాసులగు మాకు మహదానందమును సర్వసౌఖ్యములను సమకూర్చును
ఓ సౌభాగ్యలక్ష్మి ! ప్రాచార్యులైన పరాంకుశ – శఠగోపా దుల చరణములే శరణ్యము. ఏలయన వారు ద్రావిడ దివ్య ప్రబన్ధముల గూర్చి నీ గుణగానమును జేసి, భక్తులను తరింపజేసిరి.
తరువాయి వచ్చే సంచికలో…