—
ఆయన మద్రాసు వచ్చాక కూడా ఆయన్ని ఆ కూనిరాగం వెంటాడుతూనే వుంది. ఆయనలోని సంగీత కళాకారుడు ఊరుకోలేకపోయాడు. ఆ కూనిరాగంలోని బాణీని పట్టుకున్నాడు. ఫలితంగా కొత్త పాటకు బాణీ దొరికింది. తర్వాత కాలంలో ఘంటసాల విజయనగరం వెళ్ళినపుడు ఆ బాణీనందించిన కార్మికుణ్ణి గుర్తుపెట్టుకుని అతని దగ్గరకు వెళ్ళి మంచి బహుమానమిచ్చి గౌరవించారు.
డిసెంబర్ 04వ తేదీ ప్రముఖ గాయకుడు ఘంటసాల గారి జయంతి సందర్భంగా………