10_004 భువిలో విరిసిన పారిజాతం
హిందీలో విపరీత ఆదరణ రావడానికి కారణం వివరిస్తూ ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ బాలు పాటని ఇంకో మరాఠీ గాయకునితో పోలుస్తూ ‘ మీ పాట తెర మధ్యనుంచి వస్తే ఆ గాయకుడిది ఒక పక్కనుంచి మాత్రమే ధ్వనిస్తుంది ’ అన్నారట. బాలు తానెప్పుడూ సంగీతం నేర్చుకోలేదు గానీ ఒక సినిమా పాటని ఎలా పాడితే వినసొంపుగా ఉంటుందో ఆ సూత్రం తెలిసిన వాణ్ణని చెప్పుకునేవారు.