10_013 వాగ్గేయకారులు – క్షేత్రయ్య … తేనె పలుకుల పదాల కవి
పదాలలో చాలావరకూ విరహోత్కంఠిత నాయికా ప్రదర్శనం జరుగుతుంది. శృంగారం ప్రధానాంశంగా మధురభక్తి
రూపంగా వెల్లడి అవుతుంది. మధురభక్తిలో, రచయిత తనను నాయికగానూ, భగవంతుణ్ణి నాయకుడిగా భావించి భక్తిభావం అనురక్తి తెలియచేయటం జరుగుతుంది. ఇక్కడ నాయిక అంటే జీవాత్మ అని, అది పరమాత్మ అనబడే భగవంతునితో ఐక్యమవ్వాలనే తపనే ఒక విచిత్రమైన భక్తిభావంగా కవితారూపంలో వెలువడుతుంది.