SIRA Rao

13_007 నీవుండే వేములవాడ

‘ కరీమ్‌నగర్ క్షేత్రాలు ‘ ఆల్బం నుండి డా. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యానికి ఏ. ఏ. రాజా సంగీతం సమకూర్చగా పద్మజ శొంటి గానం చేశారు.

13_007 తో. లే. పి. – కెంఛో

మైత్రీబంధం ఇరువురి మధ్యన నెలకొనడానికి మూలము ఏమిటీ అంటే ఇది అని ఇదమిద్ధంగా చెప్పలేము. వాస్తవానికి ఎల్లలెరుగనిది స్నేహం. దేశం, భాష, వృత్తి‌, కులం-గోత్రాలతో దీనికి సంబంధం లేదు.
నేటికీ సుమారు 38 ఏళ్ళ క్రితం, అంటే – 1986 వ సంవత్సరంలో నాకు దక్షిణ భూటాన్ లోని ‘ గేలెగ్‌ఫగ్’ కి చెందిన కెంఛో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

13_007 మధురాష్టకం

వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం |
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

13_007 రాగాల రాకుమారుడు

భాషలందు తెలుగు లెస్స
వంశపారంపర్య మహత్యమేమో నాకు మలయాళంతో పాటు తమిళం, హిందీ, కన్నడ, ఫ్రెంచ్, ఆంగ్ల బాషలు వచ్చు. సొంపైన తెలుగు సాంతంగా అర్ధమవుతుంది. తెలుగు మాటలలోని ప్రతి చివరి అక్షరం హల్లులతో కలిసి ఉంటుంది. ఉదాహరణకి ‘రాముడు’, ‘రామ’ అంటూ దీర్ఘం తీయటానికి ఎంతో సౌకర్యం.

13_007 ద్విభాషితాలు – మందు మంట

తరతరాలుగా పురుషులు అలవర్చుకుంటున్న దురలవాట్లు….స్త్రీల జీవితాల్ని చీకటిమయం చేయడం దురదృష్టం. ఆ వేదన లోంచి పుట్టిన విషాద కవితే…. మందు మంట

13_007 మందాకిని – వృక్షో రక్షతి రక్షితః

తెల్లవారే సరికి రకరకాల పూలు పూసి మురిపించేవి. దొడ్లో కాసిన కూరలు అప్పటికప్పుడు కోసి వండుకొంటే రుచి, ఆరోగ్యం,ఆనందం. జామపండ్లు, మామిడి పండ్లు చెట్టునుండి కోసుకొని,కోరుక్కు తిన్న తృప్తి అనుభవైక వేద్యం.
రోడ్డుకి ఇరువైపులా ఎండకి నీడని,వానకి రక్షణని ఇస్తూ చెట్లు గొడుగులా నిలబడేవి. ఇప్పుడేవీ ? అవన్నీ గతకాల వైభవాలుగా మారిపోయినాయి. ఆ చక్కటి వృక్షాలన్నీ పట్టణాలలో ఆకాశహర్మ్యాలకు బలి అయిపోయాయి.

13_007 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 11

మనమంతా ఎంత అదృష్టవంతులమో ! శ్రీలు పొంగిన రేపల్లె మన జన్మస్థలమైంది. ఓ నెచ్చెలులారా ! నిండు జవ్వనులారా !
కంసుని భయంతో వేలాయుధం చేత ధరించి రాత్రింబవళ్ళు నందరాజు తన ముద్దులయ్యను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఆ నల్లనయ్య యశోదాదేవి ఒడిలో కొదమసింగంలా ఆడుకుంటున్నాడు మనోజ్ఞంగా….. ఇలా గోదాదేవి పాశురాల విశేషాలను వివరిస్తున్నారు.

13_007 సాక్షాత్కారము 10

కట్టియలపైకి చేరినకాయ మరరె!
కట్టియలతోడ తానును కాలిపోవు!
కట్టెలే వ్యర్థకాయముకన్న మేలు;
మంట పెట్టుటకై నను బనికివచ్చు!

13_007 ఓం నమశ్శివాయః – హోళికా పూర్ణిమ

ఓం నమశ్శివాయః
మాఘమాసంలో బహుళ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటాము. క్షీరసాగర మధన సమయంలో భయంకరమైన హాలాహలం వెలువడింది, దాని నుంచి వెలువడుతున్న విషజ్వాలల వలన ప్రపంచమంతా నాశనం అయ్యే పరిస్తితి ఉత్పన్నమయింది. అప్పుడు దేవతలంతా శివుని ప్రార్థించారు. వారి ప్రార్థనకు కరిగిపోయి ఒక్క గుక్కలో ఆ హాలాహలాన్ని మింగేశాడు. ఆ విషం ఆయన గొంతు నుంచి క్రిందకు జారితే సమస్త విశ్వం ప్రమాదంలో పడుతుందని గ్రహించిన పార్వతి శివుని గొంతుని నొక్కిపెట్టి ఆ హాలాహలం క్రిందకు జరకుండా చూస్తుంది. దానివలన ఆయన కంఠం కమిలిపోయి నీల వర్ణానికి మారిపోవడంతో ‘ నీలకంఠుడు ’ అయ్యాడు. ఈ సంఘటన జరిగిన రోజే ‘ శివరాత్రి ’ పర్వదినం అయింది.