10_012 త్యాగరాజ ఆరాధన
కర్ణాటక సంగీత ప్రపంచానికి ఎనలేని ఖ్యాతిని సమకూర్చిన వాగ్గేయకారుడు త్యాగరాజు తన దేహాన్ని విడిచిన రోజు పుష్య బహుళ పంచమి. ఆ మహానుభావుని స్మరించుకుంటూ కావేరీ నది తీరాన తిరువయ్యూరు లోని ఆయన సమాధి దగ్గర ప్రతి యేటా ఆరాధనోత్సవాలు నిర్వహించడం చిరకాలంగా సంప్రదాయం. ఆరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత కళాకారులు చిన్నా పెద్దా తేడా లేకుండా ఆ సమాధి చుట్టూ కూర్చుని త్యాగరాజ పంచరత్న కీర్తనలు అలపిస్తారు.