10_014

10_014 వాగ్గేయకారులు – రామతీర్థ నారాయణస్వామి

శ్రీకృష్ణ లీలాతరంగిణి సంస్కృతంలో వ్రాయబడిన సంగీతరూప కావ్యం. దీనిలోని కవితాశైలి, పదలాలిత్యం, దరువులు, శ్లోకాలు, గద్యాలు, కీర్తనలు చూస్తే ఇది యక్షగాన వర్గంలో చేరినదని తెలుస్తుంది. శుద్ధమైన ఉచ్ఛశ్రేణి సంస్కృత భాషా పాండిత్యం లేకపోయినా తెలుగు భాష తెలిసిన వారికీ ఈ కావ్యంలోని భావాభివ్యక్తి తేలికగా బోధపడినందువలన ఇది అత్యంత ప్రాచుర్యం పొందినదనటంలో సందేహం లేదు. శ్రీకృష్ణుని లీలలను తరంగాల ద్వారా పాడటం చేత దీనికీ పేరు చక్కగా సరిపోయింది.

10_014 శివోహమ్

మార్చి 11 వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా పరమ శివునికి… కాళీపట్నం సీతావసంతలక్ష్మి, పద్మజ శొంటి, శ్రీదేవి జోశ్యుల గార్ల గానార్చన.

10_014 ఓం నమశ్శివాయః

మాఘమాసంలో బహుళ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటాము. క్షీరసాగర మధన సమయంలో భయంకరమైన హాలాహలం వెలువడింది, దేవతల ప్రార్థనకు కరిగిపోయి శివుడు ఒక్క గుక్కలో ఆ హాలాహలాన్ని మింగేశాడు. పార్వతి శివుని గొంతుని నొక్కిపెట్టి ఆ హాలాహలం క్రిందకు జరకుండా చూస్తుంది. దానివలన ఆయన కంఠం కమిలిపోయి నీల వర్ణానికి మారిపోవడంతో ‘ నీలకంఠుడు ’ అయ్యాడు. ఈ సంఘటన జరిగిన రోజే ‘ శివరాత్రి ’ పర్వదినం అయింది.