Annamacharya

12_011 బంగారుతల్లి – కనకదుర్గమ్మ

ఇహపరమ్ములు వీడి ఇంద్రకీలాద్రిపై
కొలువున్న మాయమ్మ కనకదుర్గమ్మ !
శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు రచించిన ఈ భక్తిగీతం మధ్యమావతి రాగం లో శ్రీ బ్రహ్మానందం గారు..
స్వరపరచగా శ్రీ ఎమ్.ఆర్.కె.ప్రభాకర్ గారు గానం చేశారు.

12_011 షోడశ కళానిధికి…

షోడశ కళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥
ప్రముఖ నృత్యకారిణి అచ్యుతమానస కూచిపూడి నృత్య ప్రదర్శనలో అన్నమాచార్య కీర్తన…

12_010 అన్నమాచార్య కళాభిజ్ఞత 15

అలుమేలు మంగ శ్రీవెంకటేశ్వరులు ఆదిదంపతులు. వారి దాంపత్య శృంగార వైభవం లోక కళ్యాణ ప్రదమని విశ్వసించి శృంగార విషయంలో ఒక పరిణితి కలిజ్ఞటువంటి సామాజిక స్పృహ, ఒక అవగాహన పెంచే గమ్యంలో ఈ సంబంధాన్ని, ఈ బంధాన్ని ఆదర్శ మార్గంలో నడిపించేటటువంటి ఆశయంతో రచనలు సాగించారు. అనేకమైన సంకీర్తనలు వెలయించారు. సంయోగంలో స్త్రీ పురుషులిద్దరూ నాయిక, నాయకులు. ఈ నాయికానాయకుల మధ్యనున్న శృంగార సంబంధాన్ని అలుమేలుమంగ శ్రీనివాసులకు అన్వయించి భగవద్విషయం చేసి దాని మీద దైవీభావన పెంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో కొన్ని కొన్ని సంకీర్తనల ద్వారా తెలుసుకుందాం.

12_009 అన్నమాచార్య కళాభిజ్ఞత 14

అన్నమయ్య లౌకిక శృంగారాన్ని రోజువారీ మాటల్లోనే ఆయన పొందుపరిచారు. తెలిసిన భావాన్ని ఎవరికి వారుగా, ఎవరికి వారికి తెలిసిన మాటల్లో సున్నితంగా, పదం పదంలోను ప్రతి పదంలోను రసాన్ని సంపూర్ణంగా, దివ్యంగా పండించినటువంటి మహాకవి ఈయన. సారస్వత జగత్తులో ఈ మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. రసమంటే ప్రధానమైన ఒక భాగం. సర్వమైన, సమగ్రమైన, సంపూర్ణమైనటువంటి సారము అంతా కలిపి రసం. రెండవది రుచి. ఈ రెండూ మన అనుభూతిలో ఉన్న విషయాలే !

12_009 అన్నమాచార్య కీర్తనలు

తిరుమల తిరుపతి దేవస్థానం వారి పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవం లో భాగంగా ప్రముఖ నృత్యకారిణి అచ్యుతమానస కూచిపూడి నృత్య ప్రదర్శన గురు డా. కాజ వెంకట సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో…..
నట్టువాంగం : గురు డా. కాజ వెంకట సుబ్రహ్మణ్యం
గాత్రం : సూర్యనారాయణ
మృదంగం : సురేష్ బాబు
వైయోలిన్ : రమణ కూచిపూడి

12_008 అన్నమాచార్య కళాభిజ్ఞత 13

మనకి తెలిసినంతవరకు అన్నమాచార్యుడు మొట్టమొదటి ప్రజాకవి. అంటే తెలుగు భాషా వ్యవహార కవి అని చెప్పుకోవాలి. 15వ, 16వ శతాబ్దాల నాటి భాష, పలుకుబదులు, వ్యవహార విధానాలు, నిత్య జీవన సరళులు అన్నిటినీ కూడా పదాలుగా మలచి ప్రజల మనసులకి చేరువయ్యాడు.

12_006 అన్నమాచార్య కళాభిజ్ఞత12

దశావతారాల్లో భగవంతుని యొక్క అవగుణాలని చెబుతున్నాడు కవి. చూడటానికి అవగుణాలుగా కనిపించే విషయాలలో వాటి వెనుక ఉండే అర్థం… అంటే వస్తువుకి, విషయానికి ఉండే బేధాన్ని చెబతున్నారు. విషయం ఎప్పుడయితే అవగతమయిందో, అవగాహన కంటిందో…. అది వెంటనే అర్థమై, పదార్థమై, పరమార్థమై, విశేషార్థమై, తాత్వికమై సామాన్యునికి అంది…. ఈ సామాన్యుడు పురోహితమవుతాడు అని నమ్మి ఆ మార్గాన్ని చేపట్టినవాడు ఈ కవి. అన్నమాచార్యులవారు వేద పురుషుని ధర్మాలు మాత్రమే వెల్లడి చేశారు.

11_005 AV తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత 02

సంగీతానికి గమ్యం ఎప్పుడూ కూడా సహృదయ, సామాజికుని మనస్సును రసానందభరితం చెయ్యడమే ! ఆ రసానంద సిద్ధి అనేది చిరంతనమూ, సనాతనమూ, సదాతనము. దానికి ప్రధానాంశాలు నాదమూ, గానమూ, సాహిత్యము. ఈ రసానంద విశ్లేషణకి ఈ అంశాల విశ్లేషణ చాలా ముఖ్యం…..

11_003 తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత

అమెరికా చికాగొ నగరంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారతీయ సాహిత్యం, కళలకు సేవలందిస్తున్న శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా వ్యవస్థాపకులు డా. శారదాపూర్ణ శొంఠి గారి “ తాళ్ళపాక అన్నమాచార్యుని సంగీత, నృత్య కళాభిజ్ఞత ” గురించిన సోదాహరణ ప్రసంగ పరంపర లో మొదటి భాగం….

11_002 అన్నమయ్య – పోతన

ఒకరిది పద సాహిత్యమైతే, మరొకరిది పద్య సాహిత్యం. అన్నమయ్య పదాల్లో సాహితీ విలువలున్నాయి. పోతన పద్యాల్లో సంగీత బాణీలున్నాయి. వీరి పద పద్యాలు పరిశీలిస్తే నిత్య సత్యాలు, జీవన విధానం, దాని విలువలు, నిర్మలమైన మనోభావాలు, స్ఫూర్తి, మోక్షానికి మార్గం లాంటి సూత్రాలు కనిపిస్తాయి. “ఏకం సత్” అంటే శాశ్వతమైన పరమాత్మని అనన్యమైన భక్తితో స్తుతించి మోక్షాన్ని పొందారు అన్నమయ్య పోతనలు.