13_003 మందాకిని – తీర్మానం
మృగరాజు సభ ప్రారంభిస్తూ “ ఈమధ్య మానవజాతిలో మగాళ్లను ‘ మృగాడు ’ అంటూ మనతో పొలుస్తున్నారని తెలిసింది. అలా ఎందుకు అంటున్నారని అడుగుతున్నారా ? ఆ విషయం గురించి చర్చించడానికే ఈ సమావేశం.
వాళ్ళ పురాణాల్లో కీచకుడు, రావణాసురుడు లాంటి కొందరు, ఎంతో గొప్ప రాజులయినప్పటికీ స్త్రీలను అవమానించి చెరబట్టే వాళ్ళని కథలు ప్రచారంలో వున్నాయి. వారికి చెడ్డవారిగా ముద్ర పడింది. అట్లా ఎవరూ చేయకూడదనే నీతిని బోధించే కథలు. కానీ ఈనాడు వారినే కొందరు అనుసరిస్తున్నారు.