Dasavathara

13_003 అన్నమాచార్య కళాభిజ్ఞత 18

రామాయణం త్రేతాయుగ కాలానికి చెందిన రామస్వామి వృత్తాంతం. మానసిక పరివృత్తికి, ధార్మిక ప్రవృత్తి కి, సుకర్మానురక్తికి మార్గం చూపగలిగే దివ్యమైన కావ్యము.
తేన వినా తృణమపి న చలతి
నీ సంకల్పమే లేకపోతే ఏదీ సాధ్యం కాదు. సర్వం రామ సంకల్పాధీనం అని ఎరిగిన అన్నమాచార్యులు రామకథ ని అత్యద్భుతంగా తన సంకీర్తనలలో రచించిన వాటికి కొన్ని ఉదాహరణలు….

13_002 అన్నమాచార్య కళాభిజ్ఞత 17

సూత సంహితలో ఒక దివ్యమైన శ్లోకం చెప్పుకుందాం.
” గీతి గానేనయోగస్యాత్ l యోగా దేవ శివైక్యతా
గీతిజ్ణ ఓ యది యోగేన l సయతి పరమేశ్వమ్ ll ”
సంగీతం ఒక దివ్యమైన సాధన. ఒక మహా యోగం.
ఆ మహా యోగ సాధన వలన జీవునికి బ్రహ్మపద ప్రాప్తి కలుగుతుంది.
సంగీత జ్ఞానము వలన ఐశ్వర్యము అంటే ఈశ్వర తత్వ సిద్ధి కలుగుతుంది
అని భావం .
ఇది లోతెైన విషయం, లౌకిక విషయం కాదు.

13_001 అన్నమాచార్య కళాభిజ్ఞత 16

తాళ్ళపాక పద కవితలు గాన విధానాన్ని బట్టి నాలుగు విధాలుగా ఉన్నాయి. వ్యక్తి గాన పదాలు అంటే స్త్రీలు స్త్రీలకోసం పాడుకునేవి, పురుషగాన సంప్రదాయాలు. సమూహ పదాలు అంటే ఇద్దరూ కలిసి పాడుకునేవి, సంవాద పదాలు అంటే స్త్రీ పురుషుల మధ్య సంవాదము, సంభాషణ, చర్చ జరిగినవి, ప్రక్రియా పదాలు అంటే విషయాన్ని అనుసరించి అంశానికి అనుగుణంగా స్త్రీలు, పురుషులు కలిసి లేదా విడివిడిగా సంభాషణ అనే ప్రక్రియలలో అన్నమాచార్యులు రచనలు చేశారు. భాషా బేధాన్ని బట్టి ఆంధ్ర భాష, సంస్కృత భాష, గ్రామ్య భాష లోనూ సంకీర్తనా రచనలు చేశారు అన్నమాచార్యులు.

12_008 అన్నమాచార్య కళాభిజ్ఞత 13

మనకి తెలిసినంతవరకు అన్నమాచార్యుడు మొట్టమొదటి ప్రజాకవి. అంటే తెలుగు భాషా వ్యవహార కవి అని చెప్పుకోవాలి. 15వ, 16వ శతాబ్దాల నాటి భాష, పలుకుబదులు, వ్యవహార విధానాలు, నిత్య జీవన సరళులు అన్నిటినీ కూడా పదాలుగా మలచి ప్రజల మనసులకి చేరువయ్యాడు.