Gnanaprasuna

13_008 మందాకిని – సంసారంలో సరిగమలు

పిల్లలు బయటకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కడికి వెడుతున్నారో, ఎప్పుడు వస్తారో ఇంట్లోవున్న పెద్దవాళ్ళకి చెప్పివెళ్ళమని వారికి బోధించాలి. అలా చేస్తే పెద్దవాళ్ళు సంతోషిస్తారని అంటే పిల్లలు విని ఆచరించాలి. ఆ! ఈ ముసలివాళ్ళకి చెప్పేదేమిటి? అనే ఆలోచన, నిర్లక్ష్య౦ మీ మనసులోకి రాకూడదని చెప్పాలి.

13_007 మందాకిని – వృక్షో రక్షతి రక్షితః

తెల్లవారే సరికి రకరకాల పూలు పూసి మురిపించేవి. దొడ్లో కాసిన కూరలు అప్పటికప్పుడు కోసి వండుకొంటే రుచి, ఆరోగ్యం,ఆనందం. జామపండ్లు, మామిడి పండ్లు చెట్టునుండి కోసుకొని,కోరుక్కు తిన్న తృప్తి అనుభవైక వేద్యం.
రోడ్డుకి ఇరువైపులా ఎండకి నీడని,వానకి రక్షణని ఇస్తూ చెట్లు గొడుగులా నిలబడేవి. ఇప్పుడేవీ ? అవన్నీ గతకాల వైభవాలుగా మారిపోయినాయి. ఆ చక్కటి వృక్షాలన్నీ పట్టణాలలో ఆకాశహర్మ్యాలకు బలి అయిపోయాయి.

13_006 మందాకిని – ఆత్మానాం మానుషం మన్యే రామం దశరధాత్మజమ్

మృదుస్వభావి, లేతమనసున్న ఆయన, యువకుడిగా ప్రేమను గెలిచాడు. భర్తగా భార్యని గెలిచాడు. కొడుకుగా తండ్రి కోరిక నెరవేర్చాడు. అన్నగా తమ్ముళ్ళకి రాజ్యాన్ని ఇచ్చాడు. చివరికి రాజుగా ప్రజల సంక్షేమం కోసం, వంశగౌరవం నిలబెట్టడం కోసం తన ఆరోప్రాణం అయిన సీతనే అడవులకి పంపి గొప్ప రాజుగా క్షత్రియ ధర్మం నిలిపాడు. సీత లేని ఎడబాటు భరిస్తూనే రాజ్యపాలన నిర్వర్తించాడు తప్ప ఇంకో పడతి వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలో ఉన్నపుడు సొంత ప్రయోజనాల కంటే విధి నిర్వహణే ముఖ్యం అని ఎలుగెత్తి చెప్పాడు.

13_005 భక్త పోతన – జ్ఞాపకాలు

నాగయ్యగారు వేమనగా కూడా నటించారు. భక్త పోతనలో పోతన గారు ఆయనే !
కొన్ని పాత్రలు ధరించడానికి పూర్వజన్మ సుకృతం కూడా కొంత ఉండాలేమో ?
ఒక్కొక్క వ్యక్తి మన జీవిత గ్రంధంలో ఒక్కొక్క పుటగా నిలిచిపోతారు. కొందరి కథ చాలా పేజీలు. కొందరిది ఒక చిరునవ్వు. కొందరిది ఒక తియ్యటి మాట.
కొందరిది మనమోహనకరమైన చిత్రం మాత్రమే ! ఇవన్నీ తిరగేస్తుంటే ఏదో నూతనత్వం వస్తుంది. వయసు పెరిగాక మిగిలేవి వజ్రాల వంటి విలువైన జ్ఞాపకాలే !

13_004 దివ్వెల పండుగ

మానవుడు వెలుగును – ఆథ్యాత్మిక, ఆదిభౌతిక సంపదలకు చెందినది – సంతరించుకోవడం కోసం ప్రాకులాడుతూ వుంటాడు. ప్రాపంచిక రీతులలోనుంచి, గతుల నుంచి తప్పించుకొని, తపస్సిద్ధ్హి సంపన్నుడు కావడానికి ప్రయత్నిస్తూ వుంటాడు. విజ్ఞాన తేజః పుంజంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ వుంటాడు. అలాటి స్థితికి ప్రతీక దీపావళి. దివ్వెను చూస్తే మనస్సులో ఏదో మువ్వల మ్రోత వినిపిస్తుంది. అది అద్భుతమైన స్పందన. అలాటి వెలుగును కనులారా దర్శించి, మనస్సులో వెలుగులో కలబోయడం కోసమే దీపావళి.

13_004 మందాకిని – మధుర స్మృతులు

మాడపాటి హనుమంతరావు పంతులుగారు రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి గార్ల కృషి ఫలితంగా బాలికలకు ప్రత్యేకంగా బడి వుండాలనే ఉద్దేశ్యంతో స్థాపింపబడిన బడి మాది. ఐదుగురు బాలికల తో సుల్తాన్ బజారు పోలీసు స్టేషన్ ఎదురుగుండా సందులో ప్రారంభమయిన మా బడి అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్ర గర్ల్స్ హైస్కూల్ గా వాసికెక్కింది.

13_003 మందాకిని – తీర్మానం

మృగరాజు సభ ప్రారంభిస్తూ “ ఈమధ్య మానవజాతిలో మగాళ్లను ‘ మృగాడు ’ అంటూ మనతో పొలుస్తున్నారని తెలిసింది. అలా ఎందుకు అంటున్నారని అడుగుతున్నారా ? ఆ విషయం గురించి చర్చించడానికే ఈ సమావేశం.
వాళ్ళ పురాణాల్లో కీచకుడు, రావణాసురుడు లాంటి కొందరు, ఎంతో గొప్ప రాజులయినప్పటికీ స్త్రీలను అవమానించి చెరబట్టే వాళ్ళని కథలు ప్రచారంలో వున్నాయి. వారికి చెడ్డవారిగా ముద్ర పడింది. అట్లా ఎవరూ చేయకూడదనే నీతిని బోధించే కథలు. కానీ ఈనాడు వారినే కొందరు అనుసరిస్తున్నారు.

13_002 మందాకిని – నీలోత్పల

ఉత్తుంగ తరంగాలతో ఎగిసిపడే ఈ జలవాహిని చూస్తూ వుంటే కాలంతో పోటీగా పరుగెత్తాలని ప్రయత్నిస్తుందా అనిపిస్తుంది. పరవళ్ళు తొక్కుతూ పరుగెత్తుకొచ్చే అలలకు కూడా గమ్యం లేదు. నేను ముందంటే నేను ముందు అంటూ వచ్చి ఒడ్డును తాకే అలలు, ఆ అలలు మోసుకొచ్చే అల్చిప్పలు, సముద్రం మీద నుంచి వీచే స్వచ్చమైన గాలి, విస్టారంగా విశ్వమంతా పరుచుకొని ఎక్కడో కనుచూపుకి ఆననంత దూరంగా సముద్రాన్ని తాకుతున్నట్లున్న నీలాకాశం, ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎగురుతూ గూళ్లను చేరుకొంటున్న పక్షులు ఇదంతా చూస్తూ వుంటే సృష్టి ఇంత అద్భుతమైనదా ? అని ఆశ్చర్యం కలుగుతుంది. రాత్రనక పగలనక హోరుమని శబ్దం చేస్తూ ఉండే ఈ జలరాశి ఇక్కడ ఎప్పటి నుంచి వుంది ? కొన్ని కోట్ల సంవత్సరాల నించి ఇలాగే వుందా ? కదలకుండా ఇక్కడే వుండమని ఎవరు శాసించి వుంటారు ? ఏది ఏమైనా సముద్రం వంక చూస్తూ వుంటే మనల్ని మనం మనం మర్చిపోతాం. ప్రపంచాన్ని మర్చిపోతాం. బాధలు, భయాలు, ఆశలు, నిరాశలు సమస్తం మాయమయి పోతాయి.

12_012 రామాయణం లో మహోన్నత పాత్రలు

సీతాదేవి త్యాగాగ్ని హెచ్చా ? అన్నరాజ్యము అంటనన్న భరతుని త్యాగం ఘనమా ? సీతారాముల చరణముల తమ జీవితం అర్పించిన లక్ష్మణుని త్యాగనిరతి గొప్పా ? అందరూ అందరే ! వారి పాత్రలను ఆదర్శంగా తీసుకొని మానవజన్మ సార్థకం చేసుకొమ్మని సందేశానిస్తాయి.

12_011 కృష్ణం వందే జగద్గురుం

అత్యంత సుందరాకారుడు రూపలావణ్యము, గానమాధుర్యము వ్రేపల్లెవాసులను మంత్రముగ్ధులను చేశాయి. ఆ బాలుడెవరో – ఆ తత్వమేమిటో వారికి ప్రశ్నార్ధకముగా నిలిచిపోయింది. ఆయన ఆ బాలుని క్షణము విడువ లేకపోయేవారు. ప్రాణసమానంగా చూసుకునేవారు. కృష్ణుని మురళీనాదం విని గోప స్త్రీలు అన్నీ మరచి కృష్ణుని వెంట పరుగెత్తేవారు. ప్రేమ, భక్తి ముడివడి వారికొక దివ్యానుభూతిని కలిగించేది.