God

12_012 స్త్రోత్రమాలిక – వ్యాసాయ విష్ణురూపాయ…

విష్ణువు యొక్క రూపంలో ఉన్న వ్యాసునకు, వ్యాసుని యొక్క రూపంలో ఉన్న విష్ణువుకు నమస్కారం చేస్తున్నాను. అంటే విష్ణువుకు, వ్యాసునికి అబెధము చెప్పబడింది. విష్ణువే వ్యాసుని యొక్క రూపాన్ని ధరించి వేదాన్ని విభజించాడు అని చెబుతారు. ఈయన బ్రహ్మనిధి. ఈయన వాసిష్టుడు

12_011 అడగాలని ఉంది

“ ఏమిటీ, మళ్లీ పెళ్లా? సుందరికి మళ్లీ పెళ్లి చేస్తే సమాజంలో మాకు ఎంత అప్రతిష్ఠ? మా పరువు మర్యాదలు ఏం కావాలి? ” అంది సుందరి తల్లి.
వెంటనే రమణమ్మ గారు “ సమాజం అంటే ఏమిటి? మనలాంటి వాళ్ళమే గదా సమాజం అంటే. సాటి ఆడదానిగా నేను కూడా మీ అమ్మాయికి మళ్లీ పెళ్లి చేయమనే చెపుతాను. అందరు ఆడవాళ్ళ లాగా సుందరికీ భర్తతో దాంపత్య జీవితం గడపాలని ఉంటుంది గదా? అర్థం చేసుకోండి ” అంది.

12_011 భక్తి విప్లవకారులు – భగవద్రామానుజులు

ప్రతి యుగంలోనూ కొందరి మహానుభావుల ఆగమనం వల్ల ఈ ప్రపంచంలో ధర్మవర్తనులు సంఖ్య ఉంటూనే ఉంది. అయితే దేశ కాలాదులను బట్టి ధర్మం కొంత మారుతూ ఉంటుంది. ఆయా సమయ సందర్భాలననుసరించి సమాజోద్ధరణ గావించేవారు వారి కాలానికి తగినట్లుగా ధర్మబోధనలు చేస్తుంటారు. అయితే ఏ కాలంలోనైనా వారి సమకాలీన సమాజంలో ఉన్న దురాచారాలను ఖండించడం, సదాచారాలను బోధించడం తద్ద్వారా మానవులను ఉద్ధరించడం, నవసమాజ నిర్మాణం గావించడం అరుదుగా జరుగుతుంటాయి.

12_011 ముకుందమాల – భక్తితత్వం

ఈ శ్లోకాలలో మహారాజు తెలియజెప్పాలనుకున్నది భక్తి… భక్తి… భక్తి… ఇదొక్కటే మానవునికి ఇహపర సాధనం! ఇహలోకంలో దీని వలన లాభమేమిటీ అని ప్రశ్నించుకుంటే చాలా లాభమే ఉందీ అని చెప్పాలి. భక్తి వలన మనిషిలో సాత్విత భావం పెరుగతుంది. ఓర్పు, సహనం అలవడుతుంది. అంతేకాదు. భక్తికి ప్రధాన లక్షణం ప్రేమ, ‘‘అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు’’

12_011 సాక్షాత్కారము 02

తే. గీ. ఆకలింగొన్నవారికి అన్నపూర్ణ
యైన దిచట డొక్కాసీతమాంబ ! ఆమె
పుట్టువుం గన్నయీపుణ్యభూమిలోన
భళిర ! క్షుద్బాధతో ౘచ్చువాఁడు లేఁడు!

12_011 అవధానం

అవధాన ప్రక్రియ అనేది ఒక విశేషమైన, విలక్షణమైన సాహితీ ప్రక్రియ. బహుశా ఈ ప్రక్రియ సంస్కృత భాషలో తప్ప మరే ఇతర భాషల్లోనూ లేదని చెప్పుకోవచ్చు. ఈ అవధాన ప్రక్రియలో విరివిగా చేసేది ‘ అష్టావధానం ’. ఈ అష్టావధానంలో కవికి ప్రధానంగా ఉండవల్సినది ‘ ధారణా శక్తి ’, సర్వంకషమైన పాండిత్యము, స్పురణ, లోకజ్ఞత. ఉపజ్ఞత, పాండిత్యము కలిగిన అవధాని యొక్క అవధానం మనోరంజకంగా ఉంటుంది.

12_011 స్త్రోత్రమాలిక – శుక్లాంభరధరం …

ఏ పని ప్రారంభించాలన్నా మనకి ముందుగా గుర్తుకు వచ్చేది విఘ్ననాయకుడైన గణపతి. తలపెట్టిన పని నిర్విఘ్నంగా సాగాలని ముందుగా ఆ గణపతి ని పూజించి అసలు పని ప్రారంభిస్తాము. గణపతి అనగానే మనకి గుర్తుకు వచ్చే ధ్యాన శ్లోకం “ శుక్లాంభరధరం విష్ణుం…. ”.

12_010 అన్నమాచార్య కళాభిజ్ఞత 15

అలుమేలు మంగ శ్రీవెంకటేశ్వరులు ఆదిదంపతులు. వారి దాంపత్య శృంగార వైభవం లోక కళ్యాణ ప్రదమని విశ్వసించి శృంగార విషయంలో ఒక పరిణితి కలిజ్ఞటువంటి సామాజిక స్పృహ, ఒక అవగాహన పెంచే గమ్యంలో ఈ సంబంధాన్ని, ఈ బంధాన్ని ఆదర్శ మార్గంలో నడిపించేటటువంటి ఆశయంతో రచనలు సాగించారు. అనేకమైన సంకీర్తనలు వెలయించారు. సంయోగంలో స్త్రీ పురుషులిద్దరూ నాయిక, నాయకులు. ఈ నాయికానాయకుల మధ్యనున్న శృంగార సంబంధాన్ని అలుమేలుమంగ శ్రీనివాసులకు అన్వయించి భగవద్విషయం చేసి దాని మీద దైవీభావన పెంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో కొన్ని కొన్ని సంకీర్తనల ద్వారా తెలుసుకుందాం.

12_010 ముకుందమాల – భక్తితత్వం

ఎవ్వనిచే జనించి, ఈ జగమెవ్వని లోపల నుండి, ఎవ్వని యందు లీనమగుచున్నదో, అతడే పరమేశ్వరుడూ, పరబ్రహ్మమూ అని చెబుతోంది ఉపనిషత్తు. అతడు శ్రీకృష్ణుడే! విత్తులో అణిగి వున్న చెట్టులా, సూక్ష్మంగా పరమాత్మలో అణగి ఉండి, సృష్టికాలంలో ఆ పరమాత్మ సంకల్పంతో, లేచి, విస్తరించేలా, శ్రీకృష్ణుని యందే ఈ సర్వజగత్తు ఉన్నది. ఆ కారణతత్వమే శ్రీకృష్ణ పరబ్రహ్మ.

12_010 పరాకు చేసిన…

రాముడి పైనే రాసిన, ఈ జుజాహుళి రాగ కీర్తనలో త్యాగరాజుగారు రామనామాన్ని ఒక్కసారి కూడా పలకరు. కొన్ని సార్లు భక్తులు భగవంతుడిమీద అలిగి నిందస్తుతి చేసినట్టు. ఇందులో నిందలేకపోయినా రాముడికి వేర్వేర పేర్లతో బ్రతిమాలటం ఆసక్తికరంగా ఉంటుంది.