12_007 ఆనందవిహారి
చెన్నై లోని అమరజీవి స్మారక సమితి వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా జనవరి నెల కార్యక్రమం ‘ అన్నమయ్య ‘ ప్రసంగ కార్యక్రమ విశేషాలు, కాకినాడ లోని ప్రజావిద్యాలయం విద్యార్థులు నిర్వహించిన ‘ సంక్రాంతి సంబరాలు ‘ చిత్రకదంబం……
చెన్నై లోని అమరజీవి స్మారక సమితి వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా జనవరి నెల కార్యక్రమం ‘ అన్నమయ్య ‘ ప్రసంగ కార్యక్రమ విశేషాలు, కాకినాడ లోని ప్రజావిద్యాలయం విద్యార్థులు నిర్వహించిన ‘ సంక్రాంతి సంబరాలు ‘ చిత్రకదంబం……
2022వ సంవత్సరంలో అమెరికా హూస్టన్ నగరంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయం లో జరిగిన వాగ్గేయకారోత్సవం నుంచి…..
సంక్రాంతి పాట
వడ్డేపల్లి కృష్ణ రచన, శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో పద్మజ శొంటి గారి గానం….
చిత్రకారుడు ‘ కూచి ’ కుంచె నుంచి జాలువారిన కళాఖండం….
సాంకేతిక అభివృద్ధి ఎంత వేగంగా చోటు చేసుకొంటోందో …. అంతే వేగంగా ప్రపంచ పర్యావరణం… సంఘ వినాశనం… మానవతా విలువల పతనం సంభవిస్తున్నాయి. ఆ ఆవేదనలోంచి ఉద్భవించిన కవితకు దృశ్య శ్రవణ రూపం ఇది. ఈ కవితకు ప్రేరణ Bertrand Russell యొక్క వ్యాసం Man’s Peril.
ఏనుగు కొలనులో దిగి శుభ్రంగా స్నానం చేస్తుంది. తిరిగి బైటికి రాగానే దుమ్ముని మీద చిమ్ముకుంటుంది! మరింత దుమ్ము అంటుకోవడానికే కానీస్నానం వలన ప్రయోజనమేమీ ఉండదు. అందుకే భక్తిహీనకార్యాన్ని గజస్నానంతో పోలుస్తారు
అందుకే తీర్థయాత్రల్లో స్నానం చేశాము అనుకోవడం రాజసం పెరగడానికి కాకరజస్తమస్సులు తొలగి సత్వగుణం పెరిగిభగవత్ప్రాప్తిని కల్గించడానికి ఉపయోగపడాలి. శ్రీమన్నారాయణ చరణ స్మరణ పూర్వకంగా చేసిన నాడు అలా ఫలప్రాప్తిని పొందవచ్చు భగవదనుగ్రహంతో.
గ్లోబల్ ఐ GSA ఇండియా వారు అమెరికాలో నిర్వహిస్తున్న “ Educational Connect Workshop ” వివరాలు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తున్న “ డిజిటల్ మూవీ వర్క్షాప్ “ వివరాలు…..
అమెరికాలోని చికాగొ లోని శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( సప్నా ), భారతీ తీర్థ వారి సంయుక్త అధ్వర్యంలో జరిగిన తెలుగు సాహిత్య సభ “ విశ్వ వేదిక మీద తెలుగు సాహిత్యం ” కార్యక్రమ విశేషాలు…..
చెన్నై అమరజీవి స్మారక సమితి అధ్వర్యంలో నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా 31వ సంచిక “ తెలుగునాట ఎలక్ట్రానిక్ మీడియాలో తొట్టతొలి మహిళా జర్నలిస్ట్ ” ముఖాముఖీ, 32వ సంచిక అమరజీవ్ పొట్టి శ్రీరాములు, ఆయన శిష్యులు వై. ఎస్. శాస్త్రి, చిత్ర… చలనచిత్రకారులు బాపు గార్ల గురించి “ ముగ్గురు తేజోమూర్తులు ” ప్రసంగ కార్యక్రమ విశేషాలు….
ప్రకృతి ప్రేమికుణ్ణి కావడం చేత ప్రతి సంవత్సరం ప్రకృతి స్వరూపాలైన అడవులు…పర్వతాలు లోయలు.. దర్శించడం… ఆ అనుభూతుల్ని నెమరు వేసుకోవడం.. అవి అక్షర రూపం దాల్చడం ఓ అలవాటుగా మారింది. అలా ఉద్భవించిందే.. ఈ “విహారి” అనే కవిత!