Philosophy

12_011 బంగారుతల్లి – కనకదుర్గమ్మ

ఇహపరమ్ములు వీడి ఇంద్రకీలాద్రిపై
కొలువున్న మాయమ్మ కనకదుర్గమ్మ !
శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు రచించిన ఈ భక్తిగీతం మధ్యమావతి రాగం లో శ్రీ బ్రహ్మానందం గారు..
స్వరపరచగా శ్రీ ఎమ్.ఆర్.కె.ప్రభాకర్ గారు గానం చేశారు.

12_011 ముకుందమాల – భక్తితత్వం

ఈ శ్లోకాలలో మహారాజు తెలియజెప్పాలనుకున్నది భక్తి… భక్తి… భక్తి… ఇదొక్కటే మానవునికి ఇహపర సాధనం! ఇహలోకంలో దీని వలన లాభమేమిటీ అని ప్రశ్నించుకుంటే చాలా లాభమే ఉందీ అని చెప్పాలి. భక్తి వలన మనిషిలో సాత్విత భావం పెరుగతుంది. ఓర్పు, సహనం అలవడుతుంది. అంతేకాదు. భక్తికి ప్రధాన లక్షణం ప్రేమ, ‘‘అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు’’

12_011 అవధానం

అవధాన ప్రక్రియ అనేది ఒక విశేషమైన, విలక్షణమైన సాహితీ ప్రక్రియ. బహుశా ఈ ప్రక్రియ సంస్కృత భాషలో తప్ప మరే ఇతర భాషల్లోనూ లేదని చెప్పుకోవచ్చు. ఈ అవధాన ప్రక్రియలో విరివిగా చేసేది ‘ అష్టావధానం ’. ఈ అష్టావధానంలో కవికి ప్రధానంగా ఉండవల్సినది ‘ ధారణా శక్తి ’, సర్వంకషమైన పాండిత్యము, స్పురణ, లోకజ్ఞత. ఉపజ్ఞత, పాండిత్యము కలిగిన అవధాని యొక్క అవధానం మనోరంజకంగా ఉంటుంది.

12_011 కృష్ణం వందే జగద్గురుం

అత్యంత సుందరాకారుడు రూపలావణ్యము, గానమాధుర్యము వ్రేపల్లెవాసులను మంత్రముగ్ధులను చేశాయి. ఆ బాలుడెవరో – ఆ తత్వమేమిటో వారికి ప్రశ్నార్ధకముగా నిలిచిపోయింది. ఆయన ఆ బాలుని క్షణము విడువ లేకపోయేవారు. ప్రాణసమానంగా చూసుకునేవారు. కృష్ణుని మురళీనాదం విని గోప స్త్రీలు అన్నీ మరచి కృష్ణుని వెంట పరుగెత్తేవారు. ప్రేమ, భక్తి ముడివడి వారికొక దివ్యానుభూతిని కలిగించేది.

12_011 స్త్రోత్రమాలిక – శుక్లాంభరధరం …

ఏ పని ప్రారంభించాలన్నా మనకి ముందుగా గుర్తుకు వచ్చేది విఘ్ననాయకుడైన గణపతి. తలపెట్టిన పని నిర్విఘ్నంగా సాగాలని ముందుగా ఆ గణపతి ని పూజించి అసలు పని ప్రారంభిస్తాము. గణపతి అనగానే మనకి గుర్తుకు వచ్చే ధ్యాన శ్లోకం “ శుక్లాంభరధరం విష్ణుం…. ”.

12_010 అన్నమాచార్య కళాభిజ్ఞత 15

అలుమేలు మంగ శ్రీవెంకటేశ్వరులు ఆదిదంపతులు. వారి దాంపత్య శృంగార వైభవం లోక కళ్యాణ ప్రదమని విశ్వసించి శృంగార విషయంలో ఒక పరిణితి కలిజ్ఞటువంటి సామాజిక స్పృహ, ఒక అవగాహన పెంచే గమ్యంలో ఈ సంబంధాన్ని, ఈ బంధాన్ని ఆదర్శ మార్గంలో నడిపించేటటువంటి ఆశయంతో రచనలు సాగించారు. అనేకమైన సంకీర్తనలు వెలయించారు. సంయోగంలో స్త్రీ పురుషులిద్దరూ నాయిక, నాయకులు. ఈ నాయికానాయకుల మధ్యనున్న శృంగార సంబంధాన్ని అలుమేలుమంగ శ్రీనివాసులకు అన్వయించి భగవద్విషయం చేసి దాని మీద దైవీభావన పెంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో కొన్ని కొన్ని సంకీర్తనల ద్వారా తెలుసుకుందాం.

12_010 ముకుందమాల – భక్తితత్వం

ఎవ్వనిచే జనించి, ఈ జగమెవ్వని లోపల నుండి, ఎవ్వని యందు లీనమగుచున్నదో, అతడే పరమేశ్వరుడూ, పరబ్రహ్మమూ అని చెబుతోంది ఉపనిషత్తు. అతడు శ్రీకృష్ణుడే! విత్తులో అణిగి వున్న చెట్టులా, సూక్ష్మంగా పరమాత్మలో అణగి ఉండి, సృష్టికాలంలో ఆ పరమాత్మ సంకల్పంతో, లేచి, విస్తరించేలా, శ్రీకృష్ణుని యందే ఈ సర్వజగత్తు ఉన్నది. ఆ కారణతత్వమే శ్రీకృష్ణ పరబ్రహ్మ.

12_010 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం

అనాదిగా భారతదేశం అనేక భాషలకి, వివిధ మతాలకి నిలయం. ఆయా మతాల్లో, భాషల్లో ఎందరెందరో వాగ్గేయకారులు తమ తమ సంగీతాన్ని పరిపుష్టి కావించి, నాదంతో పరమాత్మను చేరగలిగే బాటను అద్భుతంగా మలచి, మనకందించి తాము సర్వేశ్వరుని సాన్నిధ్యాన్ని అందుకున్నారు. ఈ మతాలన్నీ కూడా వేద ప్రతిపాదితమైన సనాతన ధర్మపు మూలసూత్రాల ఆధారంగానే రూపు దిద్దుకున్నాయి. జీవనది లాంటి భారతీయ ఆథ్యాత్మికత కాల పరీక్షకు నిలచి మనుగడ సాగిస్తూనే ఉంది.
తమ రచనల ద్వారా జన బాహుళ్యంలో ఆస్తిక భావన పెంపొందించిన మహానుభావులను, వారి రచనలను గురించి…..

12_009 అన్నమాచార్య కళాభిజ్ఞత 14

అన్నమయ్య లౌకిక శృంగారాన్ని రోజువారీ మాటల్లోనే ఆయన పొందుపరిచారు. తెలిసిన భావాన్ని ఎవరికి వారుగా, ఎవరికి వారికి తెలిసిన మాటల్లో సున్నితంగా, పదం పదంలోను ప్రతి పదంలోను రసాన్ని సంపూర్ణంగా, దివ్యంగా పండించినటువంటి మహాకవి ఈయన. సారస్వత జగత్తులో ఈ మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. రసమంటే ప్రధానమైన ఒక భాగం. సర్వమైన, సమగ్రమైన, సంపూర్ణమైనటువంటి సారము అంతా కలిపి రసం. రెండవది రుచి. ఈ రెండూ మన అనుభూతిలో ఉన్న విషయాలే !

12_009 ముకుందమాల – భక్తితత్వం

నామరసాయనం నీకు శక్తినిస్తుంది. ఆ నామస్మరణ భగవంతునికి దాసుని చేస్తుంది. అంటే ఇంక ఈ చంచలమైన మనసుకు నీవు దాసుడవు కావు అన్నమాట! అప్పుడే పరమాత్ముని గురించిన జ్ఞానం పరమాత్మకు దగ్గర చేస్తుంది. ఈ రసాయనం లోపలి కల్మషాన్ని కరిగించి బలాన్నిస్తుంది. అంతటి శక్తివంతమైనది నామ రసాయనం. నామం ఉంటే నామి ఉన్నట్లే. నామి తోడుంటే మనసుకు బలం, ధైర్యం. విష్ణు కథలు వింటే అర్ధం అవుతుంది. ఆ స్వామి అండ ఎంత బలమో!