Rao

13_004 కార్తీక మాస ప్రాశస్త్యము

కార్తీక మాసము ప్రత్యేకంగా కుమారస్వామికి సంబంధించినదిగా పెద్దలు చెబుతారు. కృత్తికా నక్షత్రములో చంద్రుడు ఉంటుండగా పూర్ణిమ ఉండే మాసము కార్తీక మాసము. ఈ కృత్తికా నక్షత్రములు కార్తికేయునిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి లేక కుమారస్వామి యొక్క తల్లులుగా చెప్పబడుతాయి. ఆరు నక్షత్రముల గుంపు ఈ కృత్తికలు.

13_002 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 08

అనాది నుండి పరమేశ్వరుడు స్వయంగా మెచ్చి కొలువున్న పట్టణం వారణాశి. సంగీత, సాహిత్య, ఆథ్యాత్మిక త్రివేణీ సంగమ స్థలం. జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని భావించే ప్రతి ఒక్కరూ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వర దేవుని దర్శించుకోవాలని తలపోస్తూ వుంటారు. అటువంటి కాశీ వాసులైన కొందరు భక్తుల గురించి చెప్పుకుందాం. భక్త కబీరు గురించి, ఆయన జీవిత విశేషాల గురించి చెప్పుకుందాం. ఎంతవరకు నిజమో తెలియదు గాని కబీరు దాస్ పుట్టుక గురించి ఒక అలౌకికమైన కథ ప్రచారంలో ఉంది. అది…..

13_002 సాక్షాత్కారము 05

తే. గీ. ఏమహాశక్తి త న్నావహించెనొ ? యన
తరుణిపై పతి ప్రేమగీతాలు పాడు :
అంత నెద పొంగి మగతోడు నరసియరసి
కూర్మి గట్టిగా వాటేసికొను కపోతి !

13_001 సాక్షాత్కారము 04

తే. గీ. ధరణి రాలియు వాడక పరిమళాలు
తఱగనిబొగడపూ లేమితపము చేసె !
ౘచ్చియును కీర్తి దేహాన శాశ్వతు లయి
బ్రతుకు త్యాగుల కివి ఒజ్జబంతు లేమొ !

13_001 ఓయి భారతీయుడా !

విశ్వశాంతి కాంక్షించే వేదం ధర్మం మనది
అల్ప భావనలు నింపే – మతములు మనకేలరా
రామరాజ్యమ్మును కృష్ణ సారధ్యమును
వివేకానంద స్ఫూర్తులందుకొనుమ సోదరా

13_001 దక్షిణాయనం

ఉత్తరాయణం, దక్షిణాయనం అనేవి సూర్యుని యొక్క గమనమును బట్టి నిర్దేశించబడి ఉంటాయి. సూర్యోదయాన్ని రోజూ గమనిస్తూ ఉంటే తూర్పునే ఉదయిస్తున్నా ఒకే ప్రదేశంలో ఉదయించడం లేదని గమనించవచ్చు. అంటే రోజు రోజుకీ ఉదయించే ప్రదేశం కొద్దిగా మారుతూ వస్తుంది. ఇలా సూర్యుడు జరిగే దిశను బట్టి ఈ విభజన జరిగింది. ఉత్తరం వైపు జరిగితే ‘ ఉత్తరాయణం ’ గా, దక్షిణం వైపు జరిగితే ‘ దక్షిణాయనం ’ గా పిలుస్తారు. ఉత్తరాయణ కాలంలో నీటి ఆవిరి రూపంలో పైకి తీసుకున్న నీరంతా దక్షిణాయన కాలంలో క్రిందకు వర్షం రూపంలో తిరిగి వస్తుంది. భగవంతుడు ఈ దక్షిణాయనం లో మనకోసం క్రిందకు దిగివస్తాడని చెప్పుకుంటారు.

12_012 సాక్షాత్కారము 03

తే. గీ. ఎండవానలలోన తా మెండి తడిసి
శ్రితుల నీడ నిచ్చి సమాదరించుతరులు ;
తమఫలమ్ముల నొకటియున్ తాము తినక
పరులకై దాన మొనరించుతరులు ఋషులు !

12_012 రామాయణం లో మహోన్నత పాత్రలు

సీతాదేవి త్యాగాగ్ని హెచ్చా ? అన్నరాజ్యము అంటనన్న భరతుని త్యాగం ఘనమా ? సీతారాముల చరణముల తమ జీవితం అర్పించిన లక్ష్మణుని త్యాగనిరతి గొప్పా ? అందరూ అందరే ! వారి పాత్రలను ఆదర్శంగా తీసుకొని మానవజన్మ సార్థకం చేసుకొమ్మని సందేశానిస్తాయి.

12_012 స్త్రోత్రమాలిక – వ్యాసాయ విష్ణురూపాయ…

విష్ణువు యొక్క రూపంలో ఉన్న వ్యాసునకు, వ్యాసుని యొక్క రూపంలో ఉన్న విష్ణువుకు నమస్కారం చేస్తున్నాను. అంటే విష్ణువుకు, వ్యాసునికి అబెధము చెప్పబడింది. విష్ణువే వ్యాసుని యొక్క రూపాన్ని ధరించి వేదాన్ని విభజించాడు అని చెబుతారు. ఈయన బ్రహ్మనిధి. ఈయన వాసిష్టుడు