Rao

12_011 కృష్ణం వందే జగద్గురుం

అత్యంత సుందరాకారుడు రూపలావణ్యము, గానమాధుర్యము వ్రేపల్లెవాసులను మంత్రముగ్ధులను చేశాయి. ఆ బాలుడెవరో – ఆ తత్వమేమిటో వారికి ప్రశ్నార్ధకముగా నిలిచిపోయింది. ఆయన ఆ బాలుని క్షణము విడువ లేకపోయేవారు. ప్రాణసమానంగా చూసుకునేవారు. కృష్ణుని మురళీనాదం విని గోప స్త్రీలు అన్నీ మరచి కృష్ణుని వెంట పరుగెత్తేవారు. ప్రేమ, భక్తి ముడివడి వారికొక దివ్యానుభూతిని కలిగించేది.

12_011 స్త్రోత్రమాలిక – శుక్లాంభరధరం …

ఏ పని ప్రారంభించాలన్నా మనకి ముందుగా గుర్తుకు వచ్చేది విఘ్ననాయకుడైన గణపతి. తలపెట్టిన పని నిర్విఘ్నంగా సాగాలని ముందుగా ఆ గణపతి ని పూజించి అసలు పని ప్రారంభిస్తాము. గణపతి అనగానే మనకి గుర్తుకు వచ్చే ధ్యాన శ్లోకం “ శుక్లాంభరధరం విష్ణుం…. ”.

12_010 సాక్షాత్కారము 01

తే. గీ. కోటికోటిరంభలతోడ కులుకు లొలిక
స్వర్గమునె తలదన్ను నీసవనభూమి !
గరుడపచ్చలు కెంపులు కనులముందు
పఱచిన ట్లుండు నిచ్ఛటిపంటచేలు !

12_010 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం

అనాదిగా భారతదేశం అనేక భాషలకి, వివిధ మతాలకి నిలయం. ఆయా మతాల్లో, భాషల్లో ఎందరెందరో వాగ్గేయకారులు తమ తమ సంగీతాన్ని పరిపుష్టి కావించి, నాదంతో పరమాత్మను చేరగలిగే బాటను అద్భుతంగా మలచి, మనకందించి తాము సర్వేశ్వరుని సాన్నిధ్యాన్ని అందుకున్నారు. ఈ మతాలన్నీ కూడా వేద ప్రతిపాదితమైన సనాతన ధర్మపు మూలసూత్రాల ఆధారంగానే రూపు దిద్దుకున్నాయి. జీవనది లాంటి భారతీయ ఆథ్యాత్మికత కాల పరీక్షకు నిలచి మనుగడ సాగిస్తూనే ఉంది.
తమ రచనల ద్వారా జన బాహుళ్యంలో ఆస్తిక భావన పెంపొందించిన మహానుభావులను, వారి రచనలను గురించి…..

12_009 ఆమని

ఇది సరికొత్తఉగాది !
శిశిరశిధిలాలమీద శిర సెత్తినఆశలపునాది !
ఇది – దక్షిణపుగాలి వింధ్య తలదన్ని దిక్కుల నేకం చేస్తున్నవేళ !
ఆ సేతుశీతాచాలమూ అధికారాన్ని చలాయిస్తున్నవేళ !

12_009 రామాయణాల ఇంద్రధనస్సు

అతడా గ్రంథ శ్లోకములందు మరి నాలుగు కావ్యములు గర్చితములగునట్లు కూర్చెను. అయోధ్యకాండ నుండి యుద్ధకాండము వరకును గల శ్లోకముల ప్రధమాక్షరములన్నియు కలిపి చదివినచో “ గౌరీ వివాహ”మను కావ్యమును – ద్వితీయ పాదములందలి ప్రధమాక్షరములన్నియు కలిపినచో “ శ్రీరంగాది క్షేత్రమహాత్మ్యము ” – తృతీయ పాదాద్యక్షరములన్నియు కలిపినచో “ భగవదవతార చరిత్ర ” కావ్యమును – చతుర్థ పాదమునందలి అక్షరములన్నియు కలిపినచో “ ద్రౌపదీ కల్యాణం ” కావ్యమును ఏర్పడును. బాలకాండమునందలి శ్లోకముల ప్రధమాక్షరములన్నియు కూర్చినచో “ రామకవచ ”మేర్పడును. ఇది చతుస్సర్గ కావ్యమన ప్రశంసించబడినది.

12_009 శ్రీరామ రామేతి

శ్రీ విష్ణు సహస్రనామ పారాయణతో సంబంధం గలిగిన శ్లోకం ‘ శ్రీ రామ రామేతి…. ’. ఆ సంబంధం ఏమిటి ? అసలు సహస్ర నామ ప్రాశస్త్యం ఏమిటి ? ఎందుకు చదవాలి ? దానికి ఈ శ్లోకము ఎలా ప్రత్యామ్నాయము అవుతుంది ?… ఈ విశేషాలు…..

12_008 బాలభారతి – బాలలూ !

కండబలముతో గుండెబలముతో
దండిమగల మనిపించాలి !
నీతికి నిలబడి నిజాయితీతో
జాతిపేరు నిలబెట్టాలి !

12_008 దివ్య దంపతుల చూపుల పందిళ్ళు

నదులన్నీ నంది దేవుని మెడలో గంటలవలె కెరటాల చప్పుళ్ళు వినిపిస్తాయి. ప్రతి అణువు శివోహమ్ – అంటూ అహరహం స్మరించి తరించాలని ప్రాకులాడుతూ వుంటుంది. ఆ శబ్దాలు ప్రతి హృదయంలో స్పందిస్తాయి. పరమేశ్వరుని కృపకోసం ఎదురుచూస్తూ వుంటాయి.