Vasantha

13_008 రామచరిత మానస్

ఈ ఘట్టంలో సీతారాముల కల్యాణ సమయంలో ఆ వధూవరుల రూపవర్ణన, వారు ధరించిన విభిన్న ఆభూషణాల సహితంగా సీతారాముల వర్ణన, లక్ష్మణ, భరత శత్రుఘ్నుల వర్ణన, ఆరోజు అందచేయబడిన విందు, బహుమతుల సహితంగా వర్ణించబడుతోంది.

13_008 ఉగాది – శ్రీరామనవమి

ఉగాది అంటే ఏమిటి ? ఉగాది రోజున తప్పనిసరిగా చేసే ‘ ఉగాది పచ్చడి ‘ విశిష్టత ఏమిటి ? ఉగాది రోజున పంచాంగ శ్రవణం చెయ్యడం సాంప్రదాయం. ఈ పంచాంగ శ్రవణం అంటే ఏమిటి ? అందులో ఉండే అంశాలు ఏమిటి ? వాటి విశేషాలు ఏమిటి ? ….. వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు… శ్రీరాముని గురించిన విశేషాలు, ఆయన పుట్టుక, ఆయన వ్యక్తిత్వ విశేషాలను వివరిస్తూ సీతారామ కల్యాణ విశేషాలతో బాటు శ్రీరామనవమి విశిష్టత, దానితోబాటు వచ్చే వసంత నవరాత్రుల విశేషాలను వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు.

13_007 మధురాష్టకం

వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం |
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

13_007 ఓం నమశ్శివాయః – హోళికా పూర్ణిమ

ఓం నమశ్శివాయః
మాఘమాసంలో బహుళ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటాము. క్షీరసాగర మధన సమయంలో భయంకరమైన హాలాహలం వెలువడింది, దాని నుంచి వెలువడుతున్న విషజ్వాలల వలన ప్రపంచమంతా నాశనం అయ్యే పరిస్తితి ఉత్పన్నమయింది. అప్పుడు దేవతలంతా శివుని ప్రార్థించారు. వారి ప్రార్థనకు కరిగిపోయి ఒక్క గుక్కలో ఆ హాలాహలాన్ని మింగేశాడు. ఆ విషం ఆయన గొంతు నుంచి క్రిందకు జారితే సమస్త విశ్వం ప్రమాదంలో పడుతుందని గ్రహించిన పార్వతి శివుని గొంతుని నొక్కిపెట్టి ఆ హాలాహలం క్రిందకు జరకుండా చూస్తుంది. దానివలన ఆయన కంఠం కమిలిపోయి నీల వర్ణానికి మారిపోవడంతో ‘ నీలకంఠుడు ’ అయ్యాడు. ఈ సంఘటన జరిగిన రోజే ‘ శివరాత్రి ’ పర్వదినం అయింది.

13_006 రామ రక్ష

ఇటీవలే అయోధ్యలో కొలువుదీరిన రామ్ లల్లా కోసం కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారు ఆలపించారు.

13_005 పరాశర్ – కథక్ కళాకారుడు

అమెరికాలో నివసిస్తున్న తెలుగు యువకుడు పరాశర్ వయసు 15 సంవత్సరాలు. కథక్ నృత్య గురువు శ్రీమతి స్వాతి సిన్హా వద్ద చిన్న వయసు నుంచే కథక్ నాట్యం అభ్యసించడం ప్రారంభించాడు. పరాశర్ తల్లి తల్లి శ్రీమతి ఆత్మకూరి సంధ్యశ్రీ కూడా భరతనాట్య కళాకారిణి. అమెరికా లోని మిషిగన్ స్టేట్, రిసెప్టర్ లో నాట్య ధర్మి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే పేరుతో భరతనాట్య పాఠశాల నిర్వహిస్తున్నారు.

13_004 క్షీరాబ్ది కన్యకు

సాధారణంగా ఈ అన్నమయ్య కీర్తన ని శ్రీమతి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు మనకు వదిలి వెళ్లిన ఆనవాయితీ ప్రకారం ఝంపె తాళం లో పాడటం అందరికీ విదితమే. అయితే, ఝంపె తాళం కేవలం 5 అక్షరాలే కలిగి ఉన్నందున గాయకులు దాంతో కష్ట పడుతూండటం కూడా గమనిస్తూనే ఉంటాం. అలా కాకుండా త్రిశ్రగతిలో ఉంటే పాటను తాళాన్నీ కూడా మరింత సులువుగా సమర్ధించు కొనే వీలును కల్పించడానికి అదే పాటను ఇలా పాడే చొరవ తీసుకున్నాను.

13_003 గాంధీ ప్రియ భజన్

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకి ప్రియమైన మీరా భజన్…
హరి తుమ్ హారో జన్ కీ భీర్
ద్రోపదీ కీ లాజ్ రాఖీ, తుమ్ బదాయో చీర్….

13_002 గణేశ స్తుతి

చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం।
కామరూప ధరం దేవం వందే హం గణనాయకమ్‌ ॥
—————————————
గజవదనా బేడువే గౌరీ తనయా
త్రిజ్జగ బందిద్దనే సుజనరపొరవనే ||

13_001 జో అచ్యుతానంద…

నీలాంబరి నిద్రపుచ్చుతుంది. శ్రావణ మాసపు చిరుజల్లులు, భోరున కురిసే ఘనమైన మేఘాలు, ఒకవైపున పిల్లలకు భయం కలిగిస్తాయి మరోవైపు పెద్దలకు అశాంతి, చింత, యువతకు పులకింతలు, మనసుకు గిలిగింతలూ కలిగిస్తూ ఉంటే, ఏ మూలనుండో సన్నగా వినిపించే ఈ లాలిపాట పాటలకు నిద్ర, పెద్దలకు ఊరట, పిన్నలకు శాంత చిత్తాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదు.