13_005

13_005 పరాశర్ – కథక్ కళాకారుడు

అమెరికాలో నివసిస్తున్న తెలుగు యువకుడు పరాశర్ వయసు 15 సంవత్సరాలు. కథక్ నృత్య గురువు శ్రీమతి స్వాతి సిన్హా వద్ద చిన్న వయసు నుంచే కథక్ నాట్యం అభ్యసించడం ప్రారంభించాడు. పరాశర్ తల్లి తల్లి శ్రీమతి ఆత్మకూరి సంధ్యశ్రీ కూడా భరతనాట్య కళాకారిణి. అమెరికా లోని మిషిగన్ స్టేట్, రిసెప్టర్ లో నాట్య ధర్మి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే పేరుతో భరతనాట్య పాఠశాల నిర్వహిస్తున్నారు.

13_005 విదేశీయ శిల్పాలు

ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శాస్త్రీయం, అనేక పామర నాట్యాలు. ఈ విభిన్నత నన్ను ఆకట్టుకుంది.
అందుకే వాటికి సంబంధించినవి కనబడితే చాలు… నిశితంగా గమనించకుండా వదిలిపెట్టలేదు. వాటికి కావలసిన దుస్తులు, ఆభరణాలు, భంగిమలు. అలంకరణలు.. అన్నీ తెలుసుకున్నాను. ఎందరో కళాకారుల ఆహార్యాన్ని, నాట్యాన్ని గమనించాను. కావలసిన సరంజామా సమకూర్చుకుని వాటిపై ప్రయోగాలు చేశాను. పట్టుదలగా కొనసాగించి చివరకు సాధించాను. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినీయాట్టం, కథకళి, మణిపురి, ఒడిస్సీ బొమ్మలు చేసేశాను.

13_005 ద్విభాషితాలు – వివశం

అమెరికన్ కవి అయిన Robert Frost కవిత… Stopping by the Woods on a Snowy Evening ఈ “వివశం” కవితకు స్ఫూర్తి! సౌందర్యాస్వాదనకు…. బాధ్యతా నిర్వహణకు మధ్య..మనిషి పడే సంఘర్షణ ఇందులో ప్రధానాంశం.

13_005 భక్త పోతన – జ్ఞాపకాలు

నాగయ్యగారు వేమనగా కూడా నటించారు. భక్త పోతనలో పోతన గారు ఆయనే !
కొన్ని పాత్రలు ధరించడానికి పూర్వజన్మ సుకృతం కూడా కొంత ఉండాలేమో ?
ఒక్కొక్క వ్యక్తి మన జీవిత గ్రంధంలో ఒక్కొక్క పుటగా నిలిచిపోతారు. కొందరి కథ చాలా పేజీలు. కొందరిది ఒక చిరునవ్వు. కొందరిది ఒక తియ్యటి మాట.
కొందరిది మనమోహనకరమైన చిత్రం మాత్రమే ! ఇవన్నీ తిరగేస్తుంటే ఏదో నూతనత్వం వస్తుంది. వయసు పెరిగాక మిగిలేవి వజ్రాల వంటి విలువైన జ్ఞాపకాలే !

13_005 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 10

దక్షిణ భారతదేశంలో ప్రభవించిన వాగ్గేయకారులలో ముఖ్యంగా మహిళా వాగ్గేయకారులలో ముఖ్యంగా చెప్పుకోదగిన పేరు గోదాదేవి. ఆమెకే ఆముక్తమాల్యద అనే పేరు కూడా ఉంది. శ్రీరంగం పట్టణానికి చెందిన గొప్ప విష్ణుభక్తుడు విష్ణుచిత్తుని కుమార్తె ఈమె. సీతాదేవి వలెనే ఈమె కూడా అయోనిజ. విష్ణుచిత్తుడు ఒకరోజు ఎప్పటిలాగే విష్ణు కైంకర్యానికి మాలలకోసం తులసి వనానికి వెళ్ళినపుడు అక్కడ దొరుకుతుంది. భగవత్ప్రసాదం గా భావించి ఇంటికి తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఆ దంపతులు. విష్ణుసేవలో ఎదిగిన గోదాదేవి రోజుకొకటి చొప్పున ముఫ్ఫై రోజులపాటు గానం చేసిన పాశురాలన్నిటినీ కలిపి ‘ తిరుప్పావై ’ అంటారు. ఈ విశేషాలను వివరిస్తున్నారు.

13_005 సంక్రాంతి

తెలుగు వారి పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి.
మన పండుగలన్నీ సంప్రదాయం ప్రకారం సామాజికాంశాలతో బాటు ఆథ్యాత్మికాంశాలు కూడా కలగలసి ఉండడం జరుగుతుంది.
సంక్రాంతి నాలుగు రోజుల పండుగగా చెప్పుకోవచ్చును. మొదటి రోజు భోగి, రెండవరోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవరోజు ముక్కనుమ గా జరుపుకుంటారు.