11_008 బాలభారతి – చింకి గొడుగు
నీలినీలపుఆకాశం
విప్పినగొడుగల్లే వుంది !
చుక్కలు నిండిన ఆకాశం
చిల్లులగొడు గై పోతుంది !
నీలినీలపుఆకాశం
విప్పినగొడుగల్లే వుంది !
చుక్కలు నిండిన ఆకాశం
చిల్లులగొడు గై పోతుంది !
ముకుందః! దేవః! దేవకీనందన జయతు జయతు మోక్షమునిచ్చే వాడు ముకుందుడు. ఎవరీ ముకుందుడు ? మా దేవకీనందనుడే! తానెక్కడో గోలోకంలోనో, వైకుంఠంలోనో ఉంటే మనం తనను చేరలేమనీ, పొందలేమనీ, తానే దిగివచ్చి, తనచేత సృష్టించబడిన ఈ జగత్తులో, ఒక తల్లిగర్భాన పదినెలలు వసించి, ఆ తల్లి కడుపుపంటగా, ఆనందసంధాయకుడై, జన్మించినాడు.
మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసంలో గోదాదేవి వృత్తాంతం, తిరుప్పావై విశిష్టత మొదలైన ఎన్నో విశేషాలు వివరిస్తున్నారు….
అడుగు పెడుతూనే ఇక్కడ ఎలా ఉండాలో.. ఎలా మాట్లాడాలో… ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడంతో మొదలయ్యేవి ప్రాధమిక పరిక్షలు. తల్లీ తోడు లేని దేశంలో భయాన్ని…దిగులుని దిగమింగుకుని, ఒంటరిగా పిల్లల్ని సాకటం బెంగతో కూడిన పరీక్ష.
చిన్నవయసులోనే అన్నింటికీ “వై యామై డుయింగ్…వై డు అయి హావ్ టు డు?” అంటూ యక్ష ప్రశ్నలేసే పిల్లలకు సమాధానం చెప్పటం “బుర్ర గోక్కునే పరీక్ష”.
పిల్లలు కాస్త పెద్ద వాళ్ళయిన తర్వాత అన్నీ తమకే తెలుసుననుకుని వాదించే వాళ్ళతో గెలవటం “బుర్ర తినేసే పరీక్ష”.
బిడ్డలమైన మనను తండ్రి ప్రేమకు పాత్రులను చేసేది తల్లి శ్రీ. ఆమె లక్ష్మి. కృష్ణావతారంలో రాధగా, రుక్మిణిగా వచ్చినది ఆతల్లియే! ఆమె నాశ్రయిస్తే ఆమె ద్వారా పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం లేనిదే భగవదనుగ్రహం లభించడం కష్టం. భగవానుని నామాల్లో స్వామికి ఇష్టమైన నామం శ్రీవల్లభ! అందుకే ముందుగ ఆ నామంతో కీర్తించడం! అలా కీర్తించిననాడు భగవానుడు మనలను రక్షించకుండా ఉండలేడు. అమ్మద్వారా ఆశ్రయించడమే మన యోగ్యతగా, మనకు వరాలిస్తాడు.
అబ్బాయిని పెళ్ళికొడుకుని చేసేటప్పటి పాట.
ఆనందం ఆనందం ఈవేళ అబ్బాయి వరుడైన ఈవేళ నిను పెళ్లికొడుకుని చేసేటి శుభవేళ తోడ పెళ్లికొడుకుతో అలరారు ఈవేళ ఆనందం…. పెళ్ళిపనులు చురుకుగా సాగేటి ఈవేళ బంధువులు స్నేహితులు కలిసేటి శుభవేళ ఆనందం… అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యములతో కలకాలం సుఖముగా నీవు వర్ధిలవయ్యా ఆనందం…
సంగీత కళాకారిణి, సంగీత చికిత్సా నిపుణురాలు కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారు స్త్రోత్ర రత్నమాల లో లక్ష్మీదేవి రూపాలైన అష్టలక్ష్ములను కీర్తిస్తూ ఆలపించిన …..
సంగీతానికి గమ్యం ఎప్పుడూ కూడా సహృదయ, సామాజికుని మనస్సును రసానందభరితం చెయ్యడమే ! ఆ రసానంద సిద్ధి అనేది చిరంతనమూ, సనాతనమూ, సదాతనము. దానికి ప్రధానాంశాలు నాదమూ, గానమూ, సాహిత్యము. ఈ రసానంద విశ్లేషణకి ఈ అంశాల విశ్లేషణ చాలా ముఖ్యం…..
ఏడు కొండలపైన వెలసి ఉన్నావయ్య
తరలి రారా తండ్రి తరలి రమ్మిపుడే
నా హృదయమే నీకు నెలవుగా జేసెదను
నా తలపు కుసుమాల మాలలే వేసేదను
ఆశ్వయుజ మాసంలోముగురమ్మల మూలపుటమ్మగానూ,
కార్తీక మాసం లో మానవుల ఇహపర సాధనకు
ధనలక్ష్మి గా పూజలందుకుంటున్న “దేవీ వైభవం.