13_006 వార్తావళి

 

2015 వ సంవత్సరం ఆగస్ట్ 31వ తేదీన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీగారిచే విడుదల చేయబడిన ఈ డిజిటల్ తులసీకృత రామ చరిత మానస్ లో చాలా భాగం శ్రీమతి కే. సీతా వసంత లక్ష్మి పాడారు. 1971 నుంచి ప్రతి రోజూ భోపాల్ రేడియో నుండి ప్రసారం జరిగేది.

ఈ సి‌డి లు అమెజాన్ లో దొరుకుతున్నాయి. 

Available on amazon

రామచరితమానస్ డిజిటల్ రూపంలో విడుదల చేసిన సందర్భంగా 2015 వ సంవత్సరం ఆగష్టు 31 వ తేదీన మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి ప్రసంగం ఈ క్రింది వీడియో లో….. 

29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 15, 2024)

గత 29 సంవత్సరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే “క్రోధి” నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 09, 2024) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు అంతర్జాతీయ స్థాయిలో 29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” రెండు విభాగాలు ఉన్నాయి.

ప్రధాన విభాగం

భారతదేశం మినహా విదేశాలలో ఉన్న తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.

ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  US116

ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ US$116

 

“మొట్టమొదటి రచనా విభాగం”

భారత దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం  లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ “పోటీ” లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.

“నా మొట్టమొదటి కథ”: (ఉత్తమ కథ):  US$116

“నా మొట్టమొదటి కవిత”: (ఉత్తమ కవిత): US$116

 

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు

  • ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించ వచ్చును. వీలయినంత వరకూ అన్ని రచనలూ యూనికోడ్ (ఉదా. గౌతమి ఫాంట్స్) లో మాత్రమే పంపించాలి. కథల నిడివి 2500 పదాలకు మించకూడదు. (సుమారు 15 పేజీల లోపు). కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి.PDF, JPEG లలో పంపించినా ఆమోదయోగ్యమే.
  • తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు.
  • రచయితలఅముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణించబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. “మొట్టమొదటి కథ” మరియు “మొట్టమొదటి కవిత” పోటీలో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలు అని హామీ పత్రంలో పేర్కొనాలి.
  • బహుమతి పొందిన రచనలూ, ప్రచురణకి అర్హమైన ఇతర రచనలూ కౌముది.నెట్ లోనూ, మధురవాణి. కామ్, తదితర పత్రికలలోనూఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
  • విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు(ఏప్రిల్ 09, 2024) కాని, అంతకు ముందు కానీ   ప్రకటించబడతాయి. కాపీ రైట్స్  ఆయా రచయితలవే అయినా, ఆ ఈ తేదీ లోపుగా పోటీకి పంపిన రచనలను  రచయితలు ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
  • విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.

Last Date to receive entries: March 15, 2024

Please send entries by email attachments (PDF, JPEG or Unicode fonts)

sairacha@gmail.com  &   deepthinivas@gmail.com

భవదీయులు,

వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్, టెక్సస్

 

సాదర ఆహ్వానం

మిత్రులారా,

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 30 వ వార్షికోత్సవ సందర్భంగా జాతీయ స్థాయిలో “అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు” మార్చ్ 9-10, 2024  తేదీలలో కాకినాడ మహా నగరం (ఆంధ్ర ప్రదేశ్) లో జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో జరుగుతున్న ఈ  ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సుకు భారత దేశ పూర్వ ఉప రాష్ట్రపతి గౌ. వెంకయ్య నాయుడు గారు ప్రధాన అతిధిగా, సుమారు 60 మంది లబ్దప్రతిష్టులు అయిన తెలుగు రచయితలు, సాహితీవేత్తలు ఈ సదస్సులో తమ సాహిత్య ప్రసంగాలతో సభాసదులను అలరించనున్నారు.

ఈ సదస్సు ఆశయాలను వివరిస్తూ, ఆసక్తి ఉన్న వక్తలు, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు, రచయితలు, పండితులు,  విశ్లేషకులు, భాష, సాహిత్యాభిమానులకు సాదరంగా ఆహ్వానం పలుకుతూ రూపొందించిన వీడియో ప్రకటన ఈ క్రింది లంకె లో చూడవచ్చును. 

ఈ అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో పాల్గొని తెలుగు భాషా, సాహిత్యాలని ఆస్వాదించండి. ఆనందించండి. ఆదరించండి.

 పూర్తి వివరాలకు జత పరిచిన సమగ్ర ప్రకటన చూడండి. స్పందించండి.

భవదీయులు,

అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం

వంగూరి చిట్టెన్ రాజు, ఎర్రాప్రగడ రామకృష్ణ, చిరంజీవినీ కుమారి,  వక్కలంక రామకృష్ణ, యనమండ్ర సూర్యనారాయణ మూర్తి, కొరుప్రోలు గౌరి నాయుడు, డా. కాళ్ళకూరి శైలజ, మార్ని జానకి రామ చౌదరి, రాధిక మంగిపూడి, సుచిత్ర బాలాంత్రపు, మునమర్తి కృష్ణవేణి, అవధానుల మణిబాబు, జోస్యుల కృష్ణబాబు, కె. వి ఎస్. ఆర్. ప్రకాష్

సలహాదారులు: వంశీ రామరాజు (Managing Trustee, Vanguri Foundation of America, Hyderabad), శాయి రాచకొండ (గౌరవ సంపాదకులు, హ్యూస్టన్, టెక్సస్), లక్ష్మి రాయవరపు (తెలుగు తల్లి, ప్రధాన సంపాదకులు, టొరంటో, కెనడా)

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page