Meaning

13_002 అన్నమాచార్య కళాభిజ్ఞత 17

సూత సంహితలో ఒక దివ్యమైన శ్లోకం చెప్పుకుందాం.
” గీతి గానేనయోగస్యాత్ l యోగా దేవ శివైక్యతా
గీతిజ్ణ ఓ యది యోగేన l సయతి పరమేశ్వమ్ ll ”
సంగీతం ఒక దివ్యమైన సాధన. ఒక మహా యోగం.
ఆ మహా యోగ సాధన వలన జీవునికి బ్రహ్మపద ప్రాప్తి కలుగుతుంది.
సంగీత జ్ఞానము వలన ఐశ్వర్యము అంటే ఈశ్వర తత్వ సిద్ధి కలుగుతుంది
అని భావం .
ఇది లోతెైన విషయం, లౌకిక విషయం కాదు.

13_002 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 08

అనాది నుండి పరమేశ్వరుడు స్వయంగా మెచ్చి కొలువున్న పట్టణం వారణాశి. సంగీత, సాహిత్య, ఆథ్యాత్మిక త్రివేణీ సంగమ స్థలం. జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని భావించే ప్రతి ఒక్కరూ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వర దేవుని దర్శించుకోవాలని తలపోస్తూ వుంటారు. అటువంటి కాశీ వాసులైన కొందరు భక్తుల గురించి చెప్పుకుందాం. భక్త కబీరు గురించి, ఆయన జీవిత విశేషాల గురించి చెప్పుకుందాం. ఎంతవరకు నిజమో తెలియదు గాని కబీరు దాస్ పుట్టుక గురించి ఒక అలౌకికమైన కథ ప్రచారంలో ఉంది. అది…..

13_001 అన్నమాచార్య కళాభిజ్ఞత 16

తాళ్ళపాక పద కవితలు గాన విధానాన్ని బట్టి నాలుగు విధాలుగా ఉన్నాయి. వ్యక్తి గాన పదాలు అంటే స్త్రీలు స్త్రీలకోసం పాడుకునేవి, పురుషగాన సంప్రదాయాలు. సమూహ పదాలు అంటే ఇద్దరూ కలిసి పాడుకునేవి, సంవాద పదాలు అంటే స్త్రీ పురుషుల మధ్య సంవాదము, సంభాషణ, చర్చ జరిగినవి, ప్రక్రియా పదాలు అంటే విషయాన్ని అనుసరించి అంశానికి అనుగుణంగా స్త్రీలు, పురుషులు కలిసి లేదా విడివిడిగా సంభాషణ అనే ప్రక్రియలలో అన్నమాచార్యులు రచనలు చేశారు. భాషా బేధాన్ని బట్టి ఆంధ్ర భాష, సంస్కృత భాష, గ్రామ్య భాష లోనూ సంకీర్తనా రచనలు చేశారు అన్నమాచార్యులు.

13_001 ఓయి భారతీయుడా !

విశ్వశాంతి కాంక్షించే వేదం ధర్మం మనది
అల్ప భావనలు నింపే – మతములు మనకేలరా
రామరాజ్యమ్మును కృష్ణ సారధ్యమును
వివేకానంద స్ఫూర్తులందుకొనుమ సోదరా

13_001 కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం

భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద ఒకే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం విశేషం. ఒకటి కాళేశ్వరలింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వరలింగానికి రెండు నాశికారంధ్రాలున్నాయి. ఆ రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణిసంగమతీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది.

13_001 దక్షిణాయనం

ఉత్తరాయణం, దక్షిణాయనం అనేవి సూర్యుని యొక్క గమనమును బట్టి నిర్దేశించబడి ఉంటాయి. సూర్యోదయాన్ని రోజూ గమనిస్తూ ఉంటే తూర్పునే ఉదయిస్తున్నా ఒకే ప్రదేశంలో ఉదయించడం లేదని గమనించవచ్చు. అంటే రోజు రోజుకీ ఉదయించే ప్రదేశం కొద్దిగా మారుతూ వస్తుంది. ఇలా సూర్యుడు జరిగే దిశను బట్టి ఈ విభజన జరిగింది. ఉత్తరం వైపు జరిగితే ‘ ఉత్తరాయణం ’ గా, దక్షిణం వైపు జరిగితే ‘ దక్షిణాయనం ’ గా పిలుస్తారు. ఉత్తరాయణ కాలంలో నీటి ఆవిరి రూపంలో పైకి తీసుకున్న నీరంతా దక్షిణాయన కాలంలో క్రిందకు వర్షం రూపంలో తిరిగి వస్తుంది. భగవంతుడు ఈ దక్షిణాయనం లో మనకోసం క్రిందకు దిగివస్తాడని చెప్పుకుంటారు.

12_012 రామాయణం లో మహోన్నత పాత్రలు

సీతాదేవి త్యాగాగ్ని హెచ్చా ? అన్నరాజ్యము అంటనన్న భరతుని త్యాగం ఘనమా ? సీతారాముల చరణముల తమ జీవితం అర్పించిన లక్ష్మణుని త్యాగనిరతి గొప్పా ? అందరూ అందరే ! వారి పాత్రలను ఆదర్శంగా తీసుకొని మానవజన్మ సార్థకం చేసుకొమ్మని సందేశానిస్తాయి.

12_012 స్త్రోత్రమాలిక – వ్యాసాయ విష్ణురూపాయ…

విష్ణువు యొక్క రూపంలో ఉన్న వ్యాసునకు, వ్యాసుని యొక్క రూపంలో ఉన్న విష్ణువుకు నమస్కారం చేస్తున్నాను. అంటే విష్ణువుకు, వ్యాసునికి అబెధము చెప్పబడింది. విష్ణువే వ్యాసుని యొక్క రూపాన్ని ధరించి వేదాన్ని విభజించాడు అని చెబుతారు. ఈయన బ్రహ్మనిధి. ఈయన వాసిష్టుడు

12_011 బంగారుతల్లి – కనకదుర్గమ్మ

ఇహపరమ్ములు వీడి ఇంద్రకీలాద్రిపై
కొలువున్న మాయమ్మ కనకదుర్గమ్మ !
శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు రచించిన ఈ భక్తిగీతం మధ్యమావతి రాగం లో శ్రీ బ్రహ్మానందం గారు..
స్వరపరచగా శ్రీ ఎమ్.ఆర్.కె.ప్రభాకర్ గారు గానం చేశారు.

12_011 అవధానం

అవధాన ప్రక్రియ అనేది ఒక విశేషమైన, విలక్షణమైన సాహితీ ప్రక్రియ. బహుశా ఈ ప్రక్రియ సంస్కృత భాషలో తప్ప మరే ఇతర భాషల్లోనూ లేదని చెప్పుకోవచ్చు. ఈ అవధాన ప్రక్రియలో విరివిగా చేసేది ‘ అష్టావధానం ’. ఈ అష్టావధానంలో కవికి ప్రధానంగా ఉండవల్సినది ‘ ధారణా శక్తి ’, సర్వంకషమైన పాండిత్యము, స్పురణ, లోకజ్ఞత. ఉపజ్ఞత, పాండిత్యము కలిగిన అవధాని యొక్క అవధానం మనోరంజకంగా ఉంటుంది.