10_012 త్యాగరాజ ఆరాధన

.

కర్ణాటక సంగీత ప్రపంచానికి ఎనలేని ఖ్యాతిని సమకూర్చిన వాగ్గేయకారుడు త్యాగరాజు తన దేహాన్ని విడిచిన రోజు పుష్య బహుళ పంచమి. ఆ మహానుభావుని స్మరించుకుంటూ కావేరీ నది తీరాన తిరువయ్యూరు లోని ఆయన సమాధి దగ్గర ప్రతి యేటా ఆరాధనోత్సవాలు నిర్వహించడం చిరకాలంగా సంప్రదాయం. ఆరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత కళాకారులు చిన్నా పెద్దా తేడా లేకుండా ఆ సమాధి చుట్టూ కూర్చుని త్యాగరాజ పంచరత్న కీర్తనలు అలపిస్తారు. అదే పద్ధతిలో తెలుగునాట కూడా చాలా ప్రాంతాలలో త్యాగరాజ ఆరాధనోత్సవాలను సంగీత విద్వాంసులు, సంగీతప్రియులు జరుపుకుంటారు.

ఈ సంవత్సరం ఆ తిథి ఫిబ్రవరి 2వ తేదీన వచ్చింది. ఆ సందర్భంగా తెలుగు భాషను కర్ణాటక సంగీతంతో సజీవం చేసిన త్యాగరాజ భాగవతార్ ను స్మరించుకుంటూ ప్రముఖ సంగీత విద్వాంసురాలు, సంగీత చికిత్సా నిపుణులు శ్రీమతి కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారు సమర్పిస్తున్న స్వర నీరాజనాలు…….    

Kaddanu variki ….

Rare Thyagaraja Kriti in Jujahuli….

Rama rama neevaramu….

Ishai Oli Evum….

Thyagaraja Gurucharanam….