Love

13_008 మేలుకొలికే అద్భుతాలు

వాగ్గేయకారులైన అన్నమాచార్యులు, త్యాగరాజస్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ తమ కృతులతో పామరుల నుంచి జ్ఞానులను సైతం ఆలోచింపజేశారు. ఆధ్యాత్మిక, వాస్తవికత, సమాజహితం… ఇలా అన్ని అంశాలను మేళవించి ప్రతి హృదయాన్ని పులకింపజేశారు. అందుకే వారి కీర్తనలు ఎప్పటికీ మానవాళిని మేలుకోలుపుతుంటాయి. వారు రాగం, భావం, సంగీతం సమపాళ్లలో రంగరించడంవల్లే ఎప్పటికీ నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి.

13_006 మందాకిని – ఆత్మానాం మానుషం మన్యే రామం దశరధాత్మజమ్

మృదుస్వభావి, లేతమనసున్న ఆయన, యువకుడిగా ప్రేమను గెలిచాడు. భర్తగా భార్యని గెలిచాడు. కొడుకుగా తండ్రి కోరిక నెరవేర్చాడు. అన్నగా తమ్ముళ్ళకి రాజ్యాన్ని ఇచ్చాడు. చివరికి రాజుగా ప్రజల సంక్షేమం కోసం, వంశగౌరవం నిలబెట్టడం కోసం తన ఆరోప్రాణం అయిన సీతనే అడవులకి పంపి గొప్ప రాజుగా క్షత్రియ ధర్మం నిలిపాడు. సీత లేని ఎడబాటు భరిస్తూనే రాజ్యపాలన నిర్వర్తించాడు తప్ప ఇంకో పడతి వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలో ఉన్నపుడు సొంత ప్రయోజనాల కంటే విధి నిర్వహణే ముఖ్యం అని ఎలుగెత్తి చెప్పాడు.

13_002 వివాహబంధం

ఆ దెబ్బకు దిమ్మ దిరిగి, మారు మాట్లాడకుండా లోపలకు వెళ్ళి సూట్ కేసులో బట్టలు సర్దుకుని బయటకు నడిచాను. ఎక్కడికి వెళుతున్నావంటూ చైతన్య అరుస్తున్నా పట్టించుకోలేదు.
చైతన్య కొట్టిన దెబ్బకు చెంప వాచి బాధ పెడుతోంది.అలాంటి మనిషి మాటను నమ్మి, నేను వేసిన తప్పటడుగును తలుచుకుని మనసు కుమిలిపోతోంది. రగిలిపోతోంది. తనివితీరా ఏడవడానికి కూడా లేకుండా రోడ్డున పడ్డాను. ధైర్యం తెచ్చుకుని స్నేహితురాలి ఇంటికి వెళ్లాను.

12_011 కృష్ణం వందే జగద్గురుం

అత్యంత సుందరాకారుడు రూపలావణ్యము, గానమాధుర్యము వ్రేపల్లెవాసులను మంత్రముగ్ధులను చేశాయి. ఆ బాలుడెవరో – ఆ తత్వమేమిటో వారికి ప్రశ్నార్ధకముగా నిలిచిపోయింది. ఆయన ఆ బాలుని క్షణము విడువ లేకపోయేవారు. ప్రాణసమానంగా చూసుకునేవారు. కృష్ణుని మురళీనాదం విని గోప స్త్రీలు అన్నీ మరచి కృష్ణుని వెంట పరుగెత్తేవారు. ప్రేమ, భక్తి ముడివడి వారికొక దివ్యానుభూతిని కలిగించేది.

12_009 శ్రీలక్ష్మి – కథ

సదా తన మనసెరిగి ప్రవర్తిస్తూ తన అలవాట్లను..తన బలహీనతల్ని..తన అహంకారాన్నీ..దురుసుతనాన్నీ భరిస్తూ వచ్చిన శ్రీలక్ష్మి, తనను వదిలి వెళ్ళిపోయి అప్పుడే పన్నెండు రోజులైంది అంటే హరిమూర్తి కి నమ్మశక్యంగా లేదు. శ్రీలక్ష్మి ఇక లేదు అన్న సత్యాన్ని, ఆమె సంపాదించుకున్న పేరును ఈ రెంటిని హరిమూర్తి జీర్ణించుకోలేక పోతున్నాడు. ఫ్యూనరల్ టైములో శ్రీలక్ష్మి పట్ల అందరూ చూపించిన గౌరవం, ప్రేమ, దుఖం చూసి అతను ఆశ్చర్యపోయాడు.

11_004 సప్తపర్ణి కథలు – ఆవాహన

నువ్వు తింటే నీ ఆకలి తీరుతుంది. నువ్వు పరిగెడితే నీకు చెమట పడుతుంది.
సృష్టి లో ఎవరి అనుభూతి వారిది. ఇప్పుడు విను. భారత దేశం లో విశ్వాసం, భక్తి, నమ్మకం, గౌరవం
అన్నీ రక్త గతం గా ఉంటాయి. ప్రతీ జీవ కణం లోను ప్రతిస్పందిస్తూ ఉంటాయి.
మంత్రం మన లోపలి ప్రపంచాన్ని ఏ విధం గా పరిరక్షించుకోవాలో చెప్తుంది
తంత్రం భౌతిక ప్రపంచాన్ని మనకనుగుణం గా ఎలా మలచుకోవాలో తెలియచేస్తుంది.