13_002 ప్రసన్న వదన
శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఈ భక్తి గీతం గానం చేసినవారు పద్మజ శొంఠి.
శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఈ భక్తి గీతం గానం చేసినవారు పద్మజ శొంఠి.
సూత సంహితలో ఒక దివ్యమైన శ్లోకం చెప్పుకుందాం.
” గీతి గానేనయోగస్యాత్ l యోగా దేవ శివైక్యతా
గీతిజ్ణ ఓ యది యోగేన l సయతి పరమేశ్వమ్ ll ”
సంగీతం ఒక దివ్యమైన సాధన. ఒక మహా యోగం.
ఆ మహా యోగ సాధన వలన జీవునికి బ్రహ్మపద ప్రాప్తి కలుగుతుంది.
సంగీత జ్ఞానము వలన ఐశ్వర్యము అంటే ఈశ్వర తత్వ సిద్ధి కలుగుతుంది
అని భావం .
ఇది లోతెైన విషయం, లౌకిక విషయం కాదు.
అనాది నుండి పరమేశ్వరుడు స్వయంగా మెచ్చి కొలువున్న పట్టణం వారణాశి. సంగీత, సాహిత్య, ఆథ్యాత్మిక త్రివేణీ సంగమ స్థలం. జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని భావించే ప్రతి ఒక్కరూ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వర దేవుని దర్శించుకోవాలని తలపోస్తూ వుంటారు. అటువంటి కాశీ వాసులైన కొందరు భక్తుల గురించి చెప్పుకుందాం. భక్త కబీరు గురించి, ఆయన జీవిత విశేషాల గురించి చెప్పుకుందాం. ఎంతవరకు నిజమో తెలియదు గాని కబీరు దాస్ పుట్టుక గురించి ఒక అలౌకికమైన కథ ప్రచారంలో ఉంది. అది…..
శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఈ బృంద గానం చేసినవారు రాగసుధ విద్యార్థులు.
నీలాంబరి నిద్రపుచ్చుతుంది. శ్రావణ మాసపు చిరుజల్లులు, భోరున కురిసే ఘనమైన మేఘాలు, ఒకవైపున పిల్లలకు భయం కలిగిస్తాయి మరోవైపు పెద్దలకు అశాంతి, చింత, యువతకు పులకింతలు, మనసుకు గిలిగింతలూ కలిగిస్తూ ఉంటే, ఏ మూలనుండో సన్నగా వినిపించే ఈ లాలిపాట పాటలకు నిద్ర, పెద్దలకు ఊరట, పిన్నలకు శాంత చిత్తాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదు.
తాళ్ళపాక పద కవితలు గాన విధానాన్ని బట్టి నాలుగు విధాలుగా ఉన్నాయి. వ్యక్తి గాన పదాలు అంటే స్త్రీలు స్త్రీలకోసం పాడుకునేవి, పురుషగాన సంప్రదాయాలు. సమూహ పదాలు అంటే ఇద్దరూ కలిసి పాడుకునేవి, సంవాద పదాలు అంటే స్త్రీ పురుషుల మధ్య సంవాదము, సంభాషణ, చర్చ జరిగినవి, ప్రక్రియా పదాలు అంటే విషయాన్ని అనుసరించి అంశానికి అనుగుణంగా స్త్రీలు, పురుషులు కలిసి లేదా విడివిడిగా సంభాషణ అనే ప్రక్రియలలో అన్నమాచార్యులు రచనలు చేశారు. భాషా బేధాన్ని బట్టి ఆంధ్ర భాష, సంస్కృత భాష, గ్రామ్య భాష లోనూ సంకీర్తనా రచనలు చేశారు అన్నమాచార్యులు.
విశ్వశాంతి కాంక్షించే వేదం ధర్మం మనది
అల్ప భావనలు నింపే – మతములు మనకేలరా
రామరాజ్యమ్మును కృష్ణ సారధ్యమును
వివేకానంద స్ఫూర్తులందుకొనుమ సోదరా
ఈ శ్లోకాలలో మహారాజు తెలియజెప్పాలనుకున్నది భక్తి… భక్తి… భక్తి… ఇదొక్కటే మానవునికి ఇహపర సాధనం! ఇహలోకంలో దీని వలన లాభమేమిటీ అని ప్రశ్నించుకుంటే చాలా లాభమే ఉందీ అని చెప్పాలి. భక్తి వలన మనిషిలో సాత్విత భావం పెరుగతుంది. ఓర్పు, సహనం అలవడుతుంది. అంతేకాదు. భక్తికి ప్రధాన లక్షణం ప్రేమ, ‘‘అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు’’
అత్యంత సుందరాకారుడు రూపలావణ్యము, గానమాధుర్యము వ్రేపల్లెవాసులను మంత్రముగ్ధులను చేశాయి. ఆ బాలుడెవరో – ఆ తత్వమేమిటో వారికి ప్రశ్నార్ధకముగా నిలిచిపోయింది. ఆయన ఆ బాలుని క్షణము విడువ లేకపోయేవారు. ప్రాణసమానంగా చూసుకునేవారు. కృష్ణుని మురళీనాదం విని గోప స్త్రీలు అన్నీ మరచి కృష్ణుని వెంట పరుగెత్తేవారు. ప్రేమ, భక్తి ముడివడి వారికొక దివ్యానుభూతిని కలిగించేది.
అలుమేలు మంగ శ్రీవెంకటేశ్వరులు ఆదిదంపతులు. వారి దాంపత్య శృంగార వైభవం లోక కళ్యాణ ప్రదమని విశ్వసించి శృంగార విషయంలో ఒక పరిణితి కలిజ్ఞటువంటి సామాజిక స్పృహ, ఒక అవగాహన పెంచే గమ్యంలో ఈ సంబంధాన్ని, ఈ బంధాన్ని ఆదర్శ మార్గంలో నడిపించేటటువంటి ఆశయంతో రచనలు సాగించారు. అనేకమైన సంకీర్తనలు వెలయించారు. సంయోగంలో స్త్రీ పురుషులిద్దరూ నాయిక, నాయకులు. ఈ నాయికానాయకుల మధ్యనున్న శృంగార సంబంధాన్ని అలుమేలుమంగ శ్రీనివాసులకు అన్వయించి భగవద్విషయం చేసి దాని మీద దైవీభావన పెంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో కొన్ని కొన్ని సంకీర్తనల ద్వారా తెలుసుకుందాం.