Composer

13_009 ఆనందవిహారి

అమెరికాలో ఇల్లినాయిస్ లో శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( సప్నా ), వీణ గ్లోబల్ కౌన్సిల్ చికాగొ మరియు ఇండియా క్లాసికల్ మ్యూజిక్ సొసైటి ఐ‌సి‌ఎం‌ఎస్, ట్రినిటీ దత్త యోగా సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 20వ వీణా మహోత్సవం విశేషాలు, కాలిఫోర్నియా లో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారి 6వ స్నాతకోత్సవ విశేషాలు, ‘ శ్రీరస్తు ’ చిత్రం ప్రివ్యూ విశేషాలు…..

13_009 పలికే వీణకు….

లలిత గీతం
ఏ. రమేష్ సాహిత్యంలో టి. ఆర్. జయదేవ్ సంగీత సారద్యంలో పద్మజ శొంటి గారి గానం

13_009 శాస్త్రాన్ని శోధించాలి – డా. పప్పు వేణుగోపాలరావు

ప్రాచీన జ్ఞానాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా గ్రంథస్థం చేసే బృహత్ కార్యం కోసం, ఆ జ్ఞానాన్ని ఉపన్యాసాల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు కొత్తతరం ముందుకు రావాలి. ఆసక్తి ఉన్నవారు సంగీత కళాప్రదర్శనలో ఒక స్థాయికి వచ్చాక శాస్త్రం మీద దృష్టి పెట్టాలి. లక్షణ గ్రంథాలను పరిశోధించాలి. రాగం, లయ, కాల ప్రమాణం, చరిత్ర వంటి విషయాల లోతుపాతులను తెలుసుకోవాలి. గ్రంథాలను వెలువరించి వాటి సారాన్ని విద్యార్థులకి, రసికులకి అర్థమయ్యేలా ప్రాయోగికోపన్యాసాలు చేయాలి. సంగీత జ్ఞానప్రవాహాన్ని కొనసాగించాలి.

13_009 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 13

చెన్నమల్లేశ్వర స్వామిని సేవించి, ఆయనకు భక్తురాలై, ఆయన సేవలోనే జీవించి, ఆ దైవం లోనే ఐక్యమైన అక్కమహాదేవి కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ జిల్లా ఊదుతాడి గ్రామంలో క్రీ. శ. 1130వ సంవత్సరంలో వీరశైవుల ఇంట జన్మించింది. బాల్యంలోనే చెన్నమల్లిఖార్జునుని తన భర్తగా స్వీకరించి, ఆయన భావనలోనే కాలం గడిపేది. అప్పట్లో జైన మతవాలంబుడైన ఆ దేశాన్ని ఏలే రాజు కౌశికుడు ఆమె అందాన్ని చూసి ముగ్ధుడై పెళ్లాడతానని కబురు చేశాడు. మొదట ఒప్పుకోకపోయినా తల్లిదండ్రులను, బంధువులను రాజు దాష్టీకన్నుంచి తప్పించడానికి తల ఒగ్గక తప్పలేదు.

13_008 ఆనందవిహారి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా మార్చి కార్యక్రమం “ చెన్నపురిలో తెలుగు సేవకు చిరకాల చిరునామా అమరజీవి స్మారక భవనం ” ప్రసంగ కార్యక్రమ విశేషాలు,

13_008 చాలా కల్లలాడు…

తల్లితండ్రి నే నుండ తక్కిన భయంఎలా యని పాలుం రు నీ వెన్నో బాసలు జేసి
ఇలలో సరివారలలో ఎంతెంతో బ్రోచుచుండి పెద్దలతో బల్కి మెప్పించి త్యాగరాజునితో

ఆరభి రాగం, ఆది తాళం లో త్యాగరాజ కీర్తన….

13_008 మేలుకొలికే అద్భుతాలు

వాగ్గేయకారులైన అన్నమాచార్యులు, త్యాగరాజస్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ తమ కృతులతో పామరుల నుంచి జ్ఞానులను సైతం ఆలోచింపజేశారు. ఆధ్యాత్మిక, వాస్తవికత, సమాజహితం… ఇలా అన్ని అంశాలను మేళవించి ప్రతి హృదయాన్ని పులకింపజేశారు. అందుకే వారి కీర్తనలు ఎప్పటికీ మానవాళిని మేలుకోలుపుతుంటాయి. వారు రాగం, భావం, సంగీతం సమపాళ్లలో రంగరించడంవల్లే ఎప్పటికీ నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి.

13_008 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 12

ఎత్తైన, మెత్తని, చక్కని, చల్లని పూల సజ్జపై నీలదేవి కౌగిలిలో ఒదిగి వున్న మా స్వామీ కృష్ణయ్యా ! ఇలా నీ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నందుకు మన్నించు. మా విన్నపం ఆలకించి బదులు పలుకు…. అంటూ నీలదేవి కౌగిలిలో సోలి నిద్రించు స్వామిని మేలుకొలుపుతున్నది గోదా…..