.
.
అంగన్వాడీ చిన్నారులకు ఏకరూప దుస్తులు అందజేత
.
తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ లోని రాజవొమ్మంగి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని జెడ్డంగి సెక్టార్ లో 21 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో సుమారు 270 మంది చిన్నారులు ఉన్నారు. వారందరికీ అవసరమైన ఏకరూప దుస్తులను, భోజనం పళ్ళేలు, గ్లాసులు అందించడానికి కాకినాడ లోని స్వచ్ఛంద సంస్థ ‘ పరివర్తన ‘ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ప్రతినిధి వక్కలంక రామకృష్ణ ఐటిడిఏ అధికారి నిశాంత్ కుమార్ చేతుల మీదుగా ఈ సామగ్రి అంగన్వాడీ చిన్నారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏజెన్సీ లోని పిల్లలకు సాయమందించిన ‘ పరివర్తన ‘ సంస్థను, నిర్వాహకులు వక్కలంక రామకృష్ణను అధికారులు ప్రశంసించారు.
.
********************************************
.