Devotion

13_008 మేలుకొలికే అద్భుతాలు

వాగ్గేయకారులైన అన్నమాచార్యులు, త్యాగరాజస్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ తమ కృతులతో పామరుల నుంచి జ్ఞానులను సైతం ఆలోచింపజేశారు. ఆధ్యాత్మిక, వాస్తవికత, సమాజహితం… ఇలా అన్ని అంశాలను మేళవించి ప్రతి హృదయాన్ని పులకింపజేశారు. అందుకే వారి కీర్తనలు ఎప్పటికీ మానవాళిని మేలుకోలుపుతుంటాయి. వారు రాగం, భావం, సంగీతం సమపాళ్లలో రంగరించడంవల్లే ఎప్పటికీ నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి.

13_005 గ్రామ దేవతల పూజలు

జానపద కథల్లో రేణుకా ఎల్లమ్మకు మాతృపూజ చేస్తారు. మాతృపూజా పద్ధతి ఈనాటికీ జానపద కథల్లో నిత్యహరితంగా నిలిచిపోయి ఉంది. జానపద సాహిత్యంలో ఎన్నో కథల్లో ప్రాముఖ్యం వహించేది ఈ అంశమే. ఇక్కడ ప్రతి గ్రామదేవత రూపంలోనూ తల్లి దేవత ప్రత్యక్షమవుతుంది. కొండాపురం, ఎల్లేశ్వరం, సంగమేశ్వరం, ఆలంపురం వంటి అనేక శిల్పాఖనులైన స్థలాలలో ఉండే స్త్రీ ప్రతిమలను చూస్తే, ఈ అంశం స్పష్టంగా తెలుస్తుంది.