Music

13_006 నల్లని మేని నగవు చూపులవాడు ”…

శ్రీమతి భవ్య బేహత గారు అమెరికా చికాగో నగరంలో రెండు దశాబ్దాలుగా వీణ గాత్రం విద్యార్థులకి నేర్పుతున్నారు. బలమైన సంగీత సంప్రదాయాన్ని అమెరికా లో పటిష్ఠం చేస్తూ పాశ్చాత్య సంగీత కళాకారుల మన్ననలు పొందుతున్నారు. భవ్య బేహత డా. ఈమని కల్యాణి గారి నుండి ఈమని వీణా సంప్రదాయ పద్ధతి అభ్యసించి ప్రచారం చేస్తున్నారు. చికాగో “ రాగ ప్రభ “ అంతర్జాతీయ వీణా ఉత్సవాల సందర్భంగా అన్నమాచార్యుల వారి పద సంకీర్తనలు శిష్యులతో ప్రదర్శించారు.

13_006 రామా నీపై…

భోగాల అనుభవములందు బాగుగా బుద్ధి నీయందు
త్యాగరాజుని హృదయమందు వాగీశా ఆనందమందు

కేదారం రాగం, ఆది తాళం లో త్యాగరాజ కీర్తన….

13_006 అమ్మకపు వస్తువులు

డబ్బుల కోసం గడ్డి అనేది చాలా చిన్న పదం. వీళ్ళు దేనికైనా వెను కాడడం లేదు….
ఎలక్షన్లలో సీటు కోసం రాత్రికి రాత్రి పార్టీ మారిపోతున్నారు
అంతవరకు చేసిన దూషణ భూషణ తిరస్కారాలు మరచిపోతున్నారు….
ఆఖరికి అన్నదమ్ములు… అక్కా చెల్లెలు అన్న ధ్యాస కూడా మరచిపోతున్నారు….కేవలం అధికార దాహంతో ఒకరి పై ఒకరు కత్తులు దూస్తున్నారు.

13_006 ఇందరు మనుషులు

డా. సి. నారాయణరెడ్డి గారు రచించిన తెలుగు గజల్ శ్రీమతి సి. ఇందిరామణి స్వరకల్పనలో పద్మజ శొంఠి గారు ఆలపించారు. ఈ గజల్ 1980 దశకంలో హైదరాబాద్ దూరదర్శన్ లో ప్రసారమయింది.

13_006 తో. లే. పి. – వి. బస్సా

శ్రీ అరవిందుల వారు కలకత్తాను వీడి పాండిచ్చేరి కి రహస్యంగా ఆయన స్వరక్షణ కొరకు రావడానికి కారణమేమంటే, నాటి బ్రిటిష్ పాలకులు నిష్కారణంగా దేశ స్వాతంత్ర్యపోరాటానికి పూనుకున్న ఆయనపై అభియోగాన్ని మోపి ఆయనకు జైలు శిక్షను విధించడం.

13_006 రామ రక్ష

ఇటీవలే అయోధ్యలో కొలువుదీరిన రామ్ లల్లా కోసం కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారు ఆలపించారు.

13_006 ఆ ద్వయం అద్వితీయం

సంగీతం..

అదో ప్రపంచం. అభిరుచి, ఆసక్తి, కఠోర సాధన ఎంతో అవసరం. అన్నీ కలగలిస్తేనే రాణించగలరు. అలాంటిది ఒకే కుటుంబం నుంచి వచ్చి తమ అద్వితీయ ప్రతిభతో సంగీతాభిమానులను అలరిస్తున్నారీ ద్వయాలు. సంగీతోత్సవాలలో తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మైమరింపజేస్తున్నారు. అలాంటి వారిపై ప్రత్యేక కథనమిది.

13_006 ద్విభాషితాలు – పొగబండి

బాల్యంలో పొందిన అనుభూతులు కొన్ని జీవితకాలం వెంటాడి మనకు తీయని బాధను కలిగిస్తాయి. నా బాల్యంలో మనసును దోచుకున్న పొగ రైలుబండి ఈ కవితకు ప్రేరణ.

13_006 మందాకిని – ఆత్మానాం మానుషం మన్యే రామం దశరధాత్మజమ్

మృదుస్వభావి, లేతమనసున్న ఆయన, యువకుడిగా ప్రేమను గెలిచాడు. భర్తగా భార్యని గెలిచాడు. కొడుకుగా తండ్రి కోరిక నెరవేర్చాడు. అన్నగా తమ్ముళ్ళకి రాజ్యాన్ని ఇచ్చాడు. చివరికి రాజుగా ప్రజల సంక్షేమం కోసం, వంశగౌరవం నిలబెట్టడం కోసం తన ఆరోప్రాణం అయిన సీతనే అడవులకి పంపి గొప్ప రాజుగా క్షత్రియ ధర్మం నిలిపాడు. సీత లేని ఎడబాటు భరిస్తూనే రాజ్యపాలన నిర్వర్తించాడు తప్ప ఇంకో పడతి వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలో ఉన్నపుడు సొంత ప్రయోజనాల కంటే విధి నిర్వహణే ముఖ్యం అని ఎలుగెత్తి చెప్పాడు.