12_010

12_010 అన్నమాచార్య కళాభిజ్ఞత 15

అలుమేలు మంగ శ్రీవెంకటేశ్వరులు ఆదిదంపతులు. వారి దాంపత్య శృంగార వైభవం లోక కళ్యాణ ప్రదమని విశ్వసించి శృంగార విషయంలో ఒక పరిణితి కలిజ్ఞటువంటి సామాజిక స్పృహ, ఒక అవగాహన పెంచే గమ్యంలో ఈ సంబంధాన్ని, ఈ బంధాన్ని ఆదర్శ మార్గంలో నడిపించేటటువంటి ఆశయంతో రచనలు సాగించారు. అనేకమైన సంకీర్తనలు వెలయించారు. సంయోగంలో స్త్రీ పురుషులిద్దరూ నాయిక, నాయకులు. ఈ నాయికానాయకుల మధ్యనున్న శృంగార సంబంధాన్ని అలుమేలుమంగ శ్రీనివాసులకు అన్వయించి భగవద్విషయం చేసి దాని మీద దైవీభావన పెంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో కొన్ని కొన్ని సంకీర్తనల ద్వారా తెలుసుకుందాం.

12_010 అమెరికా అమ్మాయితో ముఖాముఖీ 02

విశ్వవ్యాప్తమైన భరతనాట్యము పట్ల నాకున్న ప్రగాఢనమ్మకము, ఆసక్తి, గురువుల వద్ద శిక్షణ, నా నాట్యరీతులకు రూపుదిద్ది, వాటికి ఎన్నో సొగసులను అందించింది. నాట్యానికి భౌగోళికమైన సరిహద్దులు, ఎల్లలు వంటివి లేనేలేవు. నిజం చెప్పాలంటే సమైక్యత, శాంతి, సౌందర్యము కేవలం ఏ కొద్దిమందికో పరిమితం కావు. కళ అన్నది ఒక పరికరము. అది విశ్వవ్యాప్తం. ప్రపంచాన్ని గురించిన విశాల అవగాహన ను కలిగి, జీవితంతో ముడిపడి ఉండడం దాని లక్షణము. లక్ష్యము ..

12_010 ముకుందమాల – భక్తితత్వం

ఎవ్వనిచే జనించి, ఈ జగమెవ్వని లోపల నుండి, ఎవ్వని యందు లీనమగుచున్నదో, అతడే పరమేశ్వరుడూ, పరబ్రహ్మమూ అని చెబుతోంది ఉపనిషత్తు. అతడు శ్రీకృష్ణుడే! విత్తులో అణిగి వున్న చెట్టులా, సూక్ష్మంగా పరమాత్మలో అణగి ఉండి, సృష్టికాలంలో ఆ పరమాత్మ సంకల్పంతో, లేచి, విస్తరించేలా, శ్రీకృష్ణుని యందే ఈ సర్వజగత్తు ఉన్నది. ఆ కారణతత్వమే శ్రీకృష్ణ పరబ్రహ్మ.

12_010 సాక్షాత్కారము 01

తే. గీ. కోటికోటిరంభలతోడ కులుకు లొలిక
స్వర్గమునె తలదన్ను నీసవనభూమి !
గరుడపచ్చలు కెంపులు కనులముందు
పఱచిన ట్లుండు నిచ్ఛటిపంటచేలు !

12_010 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం

అనాదిగా భారతదేశం అనేక భాషలకి, వివిధ మతాలకి నిలయం. ఆయా మతాల్లో, భాషల్లో ఎందరెందరో వాగ్గేయకారులు తమ తమ సంగీతాన్ని పరిపుష్టి కావించి, నాదంతో పరమాత్మను చేరగలిగే బాటను అద్భుతంగా మలచి, మనకందించి తాము సర్వేశ్వరుని సాన్నిధ్యాన్ని అందుకున్నారు. ఈ మతాలన్నీ కూడా వేద ప్రతిపాదితమైన సనాతన ధర్మపు మూలసూత్రాల ఆధారంగానే రూపు దిద్దుకున్నాయి. జీవనది లాంటి భారతీయ ఆథ్యాత్మికత కాల పరీక్షకు నిలచి మనుగడ సాగిస్తూనే ఉంది.
తమ రచనల ద్వారా జన బాహుళ్యంలో ఆస్తిక భావన పెంపొందించిన మహానుభావులను, వారి రచనలను గురించి…..

12_010 ప్రగాఢ భక్తికి ప్రతీక

శ్రీ తులసీదాసు రామాయణం రచించే రోజులు. జనం ఆయన రామాయణ కావ్య కథనాన్ని వినడానికి ప్రతిరోజూ ఆయన ఉన్న చోటికి చేరేవారు. ఒకరోజు ఒక భక్తుడు “ అయ్యా ! తమరింత భక్తి స్ఫోరకంగా రామాయణ రచన చేస్తున్నారు. అసలు రామశబ్దం వింటే చాలు, రామాయణ కథ ఎవరైనా చెప్పుకొంటున్నా చాలు, శ్రీ ఆంజనేయుడక్కడికి వేంచేసి ఆ కథ వింటూ వుంటాడట ! మీరింత భక్తి రసఝరులు ప్రవహించే విధంగా కథనం చేస్తున్నారు. శ్రీ ఆంజనేయుడు ప్రతిరోజూ మీ కథాగానాన్ని అలకించటానికి ఇక్కడే ఎక్కడో ఏదో రూపంలో తప్పకుండా వుంటాడు ’ అన్నాడు.

12_010 నృసింహ – బుద్ధ జయంతులు…

హిరణ్యకశ్యపునికి ఉన్న వర ప్రభావం వలన అతన్ని సంహరించడం కోసం అటు జంతువు కాకుండా, ఇటు మనిషి కాకుండా నర, సింహ రూపంలో వచ్చి పగలు, రాత్రి కాకుండా మధ్య సమయం అయిన సాయం సంధ్యలో ఇంటి లోపల, బయిట కాకుండా గడప మీద సంహరించడానికి మహావిష్ణువు నరసింహావతారం ధరించి రావడం మనందరికీ తెలిసిన విషయమే ! ఆ అవతార ప్రాశస్త్యం గురించి మరిన్ని విశేషాలు నరసింహ జయంతి సందర్భంగా, వైశాఖ పూర్ణిమ నాడు వచ్చే బుద్ధ జయంతి ప్రాశస్త్యాన్ని ఈ క్రింది వీడియో లో వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు.