10_016 ఋషిమండలం
జీవన విధానాన్ని, జీవిత పరమార్థాన్నీ నిర్ణయించి చెప్పేవారు కావాలి. ఆ సూత్రాలు కాలానికి నిలబడాలి. ఆ నిర్ణయాలలో ద్వైదీ భావం అంటే ఔను – కాదు అనే విచక్షణతో కూడిన సూత్రం కాక, నిత్యమై, సత్యమై ఉండే సూత్రం కావాలి. ఏకత, ఏకసూత్రత ఉండాలి. అప్పుడే అది ధర్మంగా పరిగణన పొందుతుంది.