13_008 సాక్షాత్కారము 11
మనిషిగా పుట్టియును
మానవత్వము లేక
రాక్షసత్వమ్ముతో
బ్రతికినా నిన్నాళ్లు!
మనిషిగా పుట్టియును
మానవత్వము లేక
రాక్షసత్వమ్ముతో
బ్రతికినా నిన్నాళ్లు!
కట్టియలపైకి చేరినకాయ మరరె!
కట్టియలతోడ తానును కాలిపోవు!
కట్టెలే వ్యర్థకాయముకన్న మేలు;
మంట పెట్టుటకై నను బనికివచ్చు!
ఎన్నో బెజ్జము లున్న తనువులో
గాలి నిలుచుటే ఆశ్చర్యం!
గాలిబ్రతుకు లివి రాలిపోవడం.
కానేకా దిది ఆశ్చర్యం!!
భావుక చరణం భవసంతరణం
భవ్య సేవక జన భాగ్య వితరణం
అవ్యయ విమల విభూతి విజృంభిత దివ్య మణి
రచిత వివిధాభరణమ్
ఈ శ్లోకాలలో మహారాజు తెలియజెప్పాలనుకున్నది భక్తి… భక్తి… భక్తి… ఇదొక్కటే మానవునికి ఇహపర సాధనం! ఇహలోకంలో దీని వలన లాభమేమిటీ అని ప్రశ్నించుకుంటే చాలా లాభమే ఉందీ అని చెప్పాలి. భక్తి వలన మనిషిలో సాత్విత భావం పెరుగతుంది. ఓర్పు, సహనం అలవడుతుంది. అంతేకాదు. భక్తికి ప్రధాన లక్షణం ప్రేమ, ‘‘అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు’’
ఎవ్వనిచే జనించి, ఈ జగమెవ్వని లోపల నుండి, ఎవ్వని యందు లీనమగుచున్నదో, అతడే పరమేశ్వరుడూ, పరబ్రహ్మమూ అని చెబుతోంది ఉపనిషత్తు. అతడు శ్రీకృష్ణుడే! విత్తులో అణిగి వున్న చెట్టులా, సూక్ష్మంగా పరమాత్మలో అణగి ఉండి, సృష్టికాలంలో ఆ పరమాత్మ సంకల్పంతో, లేచి, విస్తరించేలా, శ్రీకృష్ణుని యందే ఈ సర్వజగత్తు ఉన్నది. ఆ కారణతత్వమే శ్రీకృష్ణ పరబ్రహ్మ.
నామరసాయనం నీకు శక్తినిస్తుంది. ఆ నామస్మరణ భగవంతునికి దాసుని చేస్తుంది. అంటే ఇంక ఈ చంచలమైన మనసుకు నీవు దాసుడవు కావు అన్నమాట! అప్పుడే పరమాత్ముని గురించిన జ్ఞానం పరమాత్మకు దగ్గర చేస్తుంది. ఈ రసాయనం లోపలి కల్మషాన్ని కరిగించి బలాన్నిస్తుంది. అంతటి శక్తివంతమైనది నామ రసాయనం. నామం ఉంటే నామి ఉన్నట్లే. నామి తోడుంటే మనసుకు బలం, ధైర్యం. విష్ణు కథలు వింటే అర్ధం అవుతుంది. ఆ స్వామి అండ ఎంత బలమో!