Swamy

13_004 సమయము తెలిసి…

అసావేరి రాగం, మిశ్రచాపు తాళం లో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి కీర్తన.
సమయము తెలిసి పుణ్యములార్జించని
కుమతి ఉండియేమి పోయియేమి

13_004 సంగీతం – సర్వేశ్వరుని చేరే సాధనం 09

భక్త వాగ్గేయకారుల జీవితాలు మహిమాన్వితాలని చెప్పుకున్నాం కదా ! తులసీదాసు విషయంలో కూడా జరిగిన ఒక విశేషాన్ని చెప్పుకోవాలి. ఒకనాడు ఒక స్త్రీ విలపిస్తూ తులసీదాసు పాదాలకు నమస్కరించింది. ఆమెను ‘ దీర్ఘసుమంగళీభవ ‘ అంటూ ఆశీర్వదించాడు. ‘ నన్నెందుకు అవహేళన చేస్తారు స్వామీ ! నా భర్త చనిపోయారు. ఆ దుఃఖం లో ఉండి మీకు నమస్కరించాను ’ అంటుంది.
“ తల్లీ నాకు నిజంగా నీ భర్త మరణించిన విషయం తెలియదు. అప్రయత్నంగా అలా ఆశీర్వదించాను. రాముడే నా నోట అలా పలికించి ఉండాలి. ఆ వాక్కులు వృథా కారాదు. నీవు వెళ్లి చనిపోయిన నీ భర్త చెవిలో రామనామాన్ని ఉచ్చరించు. విశ్వాసంతో వెళ్ళు ” అంటారు. ఆమె అలాగే చేస్తే ఆమె భర్త బతికాడు.

13_004 కార్తీక మాస ప్రాశస్త్యము

కార్తీక మాసము ప్రత్యేకంగా కుమారస్వామికి సంబంధించినదిగా పెద్దలు చెబుతారు. కృత్తికా నక్షత్రములో చంద్రుడు ఉంటుండగా పూర్ణిమ ఉండే మాసము కార్తీక మాసము. ఈ కృత్తికా నక్షత్రములు కార్తికేయునిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి లేక కుమారస్వామి యొక్క తల్లులుగా చెప్పబడుతాయి. ఆరు నక్షత్రముల గుంపు ఈ కృత్తికలు.

13_002 వాగ్గేయకారోత్సవం – గోష్టి గానం

ప్రముఖ వాగ్గేయకారులు శ్రీయుతులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నమాచార్య, యోగి నారాయణ, నారాయణ తీర్తులు, భద్రాచల రామదాసు గారల కీర్తనలతో….. అమెరికా టెక్సాస్ లో జరిగిన ‘ వాగ్గేయకార వైభవం ” నుంచి. గోష్టి గానం….

13_001 కంటికంటి నిలువు…

కనకపుపాదములు గజ్జెలూ అందెలునూ
ఘన పీతాంబరముపై కట్టుకట్టారి
మొనసి వడ్డాణపు మొగపుల మొలనులు,
మొనసి వడ్డాణపు మొగపుల మొలనులు
ఉనరనభికమల ఉదరబంధములూ

12_011 సునాదసుధ – శారదే కరుణానిధే

అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ లో ఉన్న ‘ సునాదసుధ ‘ సంగీత కుటీరంలో జరిగిన ప్రదర్శన నుంచి విఘ్నేష్ మనోహరన్ గానం చేసిన శృంగేరి పీఠాధిపతి రచించిన కీర్తన… హమీర్ కళ్యాణి రాగం లో…. .
శారదే కరుణానిధే…..

12_011 ముకుందమాల – భక్తితత్వం

ఈ శ్లోకాలలో మహారాజు తెలియజెప్పాలనుకున్నది భక్తి… భక్తి… భక్తి… ఇదొక్కటే మానవునికి ఇహపర సాధనం! ఇహలోకంలో దీని వలన లాభమేమిటీ అని ప్రశ్నించుకుంటే చాలా లాభమే ఉందీ అని చెప్పాలి. భక్తి వలన మనిషిలో సాత్విత భావం పెరుగతుంది. ఓర్పు, సహనం అలవడుతుంది. అంతేకాదు. భక్తికి ప్రధాన లక్షణం ప్రేమ, ‘‘అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు’’

12_010 ముకుందమాల – భక్తితత్వం

ఎవ్వనిచే జనించి, ఈ జగమెవ్వని లోపల నుండి, ఎవ్వని యందు లీనమగుచున్నదో, అతడే పరమేశ్వరుడూ, పరబ్రహ్మమూ అని చెబుతోంది ఉపనిషత్తు. అతడు శ్రీకృష్ణుడే! విత్తులో అణిగి వున్న చెట్టులా, సూక్ష్మంగా పరమాత్మలో అణగి ఉండి, సృష్టికాలంలో ఆ పరమాత్మ సంకల్పంతో, లేచి, విస్తరించేలా, శ్రీకృష్ణుని యందే ఈ సర్వజగత్తు ఉన్నది. ఆ కారణతత్వమే శ్రీకృష్ణ పరబ్రహ్మ.

12_009 ముకుందమాల – భక్తితత్వం

నామరసాయనం నీకు శక్తినిస్తుంది. ఆ నామస్మరణ భగవంతునికి దాసుని చేస్తుంది. అంటే ఇంక ఈ చంచలమైన మనసుకు నీవు దాసుడవు కావు అన్నమాట! అప్పుడే పరమాత్ముని గురించిన జ్ఞానం పరమాత్మకు దగ్గర చేస్తుంది. ఈ రసాయనం లోపలి కల్మషాన్ని కరిగించి బలాన్నిస్తుంది. అంతటి శక్తివంతమైనది నామ రసాయనం. నామం ఉంటే నామి ఉన్నట్లే. నామి తోడుంటే మనసుకు బలం, ధైర్యం. విష్ణు కథలు వింటే అర్ధం అవుతుంది. ఆ స్వామి అండ ఎంత బలమో!

12_008 ముకుందమాల – భక్తితత్వం

వేంకటేశా! మేం నిన్ను తలచేంత పని లేకుండానే నీ దాసులే మాకు ఇహపరాల నివ్వగల సమర్థులు. ఎందుకంటే నిన్ను సంపూర్ణంగా తెలుసుకున్న విజ్ఞానులు వారు. మరి వారిని తెలుసుకుని అనుసరిస్తే నిన్ను తెలుసుకున్నట్లే కదా! అందుకే నీ బంటు బంటుకు బంటునయినా చాలు. నీకు దాసుడనై తరించినట్లే! అంటారు అన్నమయ్య దాసోహపద్ధతిని వ్యక్తపరుస్తూ.