Tummapudi

12_011 భక్తి విప్లవకారులు – భగవద్రామానుజులు

ప్రతి యుగంలోనూ కొందరి మహానుభావుల ఆగమనం వల్ల ఈ ప్రపంచంలో ధర్మవర్తనులు సంఖ్య ఉంటూనే ఉంది. అయితే దేశ కాలాదులను బట్టి ధర్మం కొంత మారుతూ ఉంటుంది. ఆయా సమయ సందర్భాలననుసరించి సమాజోద్ధరణ గావించేవారు వారి కాలానికి తగినట్లుగా ధర్మబోధనలు చేస్తుంటారు. అయితే ఏ కాలంలోనైనా వారి సమకాలీన సమాజంలో ఉన్న దురాచారాలను ఖండించడం, సదాచారాలను బోధించడం తద్ద్వారా మానవులను ఉద్ధరించడం, నవసమాజ నిర్మాణం గావించడం అరుదుగా జరుగుతుంటాయి.

12_010 క్రాంతదర్శి – కందుకూరి

వట్టి మాటలు కట్టి పెట్టిన ఘనుడు….
సంఘం కోసం సర్వస్వం అర్పించేసిన త్యాగ ధనుడు…..
హితకారిణి స్థాపించి దిక్కులేని ఆడవారికి
పునర్జీవితాలను ఒసగిన మాన్యుడు…
తెలుగు సాహిత్యానికి నవ యుగ వైతాళికుడు…

11_001 మాలతీ సాహితీ మధువు

Malathi sahitee madhuvu
ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో “ప్రమదావనం” పేరిట కాలమిస్టుగా తెలుగు ప్రమదల జీవితాల్లో వెలుగులను నింపిన నిరంతరాన్వేషి మాలతీ చందూర్. కుట్లు, అల్లికలు, వంటలు, వ్యక్తిగత, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, సంప్రదాయాది అంశాలపైన అడిగిన అన్ని ప్రశ్నలకి నిక్కచ్చిగ, నిబద్ధతతో ఆమె ఇచ్చే సమాధానాల కోసం తెలుగు మహిళా లోకం ఎంతో అత్రుతగా పడిగాపులు గాచేది. తెలుగింటి ఆడపడుచుల కష్టాలకొక కల్పలతగా భాసిస్తూ ప్రమదావనం సుమారు 50 ఏళ్ళ పాటు ఆంధ్ర మహిళలను అలరించింది.