12_012 చందమామ
సంగీత సామ్రాట్, సంగీత విద్వాన్ శ్రీ ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ గారు స్వరపరిచిన పదకవితాపితామహ అన్నమాచార్యులవారి కీర్తన సౌరాష్ట్ర రాగం, ఆదితాళం లో……
సంగీత సామ్రాట్, సంగీత విద్వాన్ శ్రీ ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ గారు స్వరపరిచిన పదకవితాపితామహ అన్నమాచార్యులవారి కీర్తన సౌరాష్ట్ర రాగం, ఆదితాళం లో……
సామజము గాంచినది సంకీర్తనం
సామమున కెక్కుడీ సంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం
సామాన్యమా విష్ణు సంకీర్తనం
ఇహపరమ్ములు వీడి ఇంద్రకీలాద్రిపై
కొలువున్న మాయమ్మ కనకదుర్గమ్మ !
శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు రచించిన ఈ భక్తిగీతం మధ్యమావతి రాగం లో శ్రీ బ్రహ్మానందం గారు..
స్వరపరచగా శ్రీ ఎమ్.ఆర్.కె.ప్రభాకర్ గారు గానం చేశారు.
అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ లో ఉన్న ‘ సునాదసుధ ‘ సంగీత కుటీరంలో జరిగిన ప్రదర్శన నుంచి విద్వాన్ అరవింద్ సుందర్ గానం చేసిన అన్నమయ్య కీర్తన… నాట్ట రాగం, రూపక తాళం.
నమో నమో రఘుకుల నాయక దివిజవంద్య
నమో నమో శంకరనగజానుత…..
అలుమేలు మంగ శ్రీవెంకటేశ్వరులు ఆదిదంపతులు. వారి దాంపత్య శృంగార వైభవం లోక కళ్యాణ ప్రదమని విశ్వసించి శృంగార విషయంలో ఒక పరిణితి కలిజ్ఞటువంటి సామాజిక స్పృహ, ఒక అవగాహన పెంచే గమ్యంలో ఈ సంబంధాన్ని, ఈ బంధాన్ని ఆదర్శ మార్గంలో నడిపించేటటువంటి ఆశయంతో రచనలు సాగించారు. అనేకమైన సంకీర్తనలు వెలయించారు. సంయోగంలో స్త్రీ పురుషులిద్దరూ నాయిక, నాయకులు. ఈ నాయికానాయకుల మధ్యనున్న శృంగార సంబంధాన్ని అలుమేలుమంగ శ్రీనివాసులకు అన్వయించి భగవద్విషయం చేసి దాని మీద దైవీభావన పెంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో కొన్ని కొన్ని సంకీర్తనల ద్వారా తెలుసుకుందాం.
అన్నమయ్య లౌకిక శృంగారాన్ని రోజువారీ మాటల్లోనే ఆయన పొందుపరిచారు. తెలిసిన భావాన్ని ఎవరికి వారుగా, ఎవరికి వారికి తెలిసిన మాటల్లో సున్నితంగా, పదం పదంలోను ప్రతి పదంలోను రసాన్ని సంపూర్ణంగా, దివ్యంగా పండించినటువంటి మహాకవి ఈయన. సారస్వత జగత్తులో ఈ మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. రసమంటే ప్రధానమైన ఒక భాగం. సర్వమైన, సమగ్రమైన, సంపూర్ణమైనటువంటి సారము అంతా కలిపి రసం. రెండవది రుచి. ఈ రెండూ మన అనుభూతిలో ఉన్న విషయాలే !
తిరుమల తిరుపతి దేవస్థానం వారి పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవం లో భాగంగా ప్రముఖ నృత్యకారిణి అచ్యుతమానస కూచిపూడి నృత్య ప్రదర్శన గురు డా. కాజ వెంకట సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో…..
నట్టువాంగం : గురు డా. కాజ వెంకట సుబ్రహ్మణ్యం
గాత్రం : సూర్యనారాయణ
మృదంగం : సురేష్ బాబు
వైయోలిన్ : రమణ కూచిపూడి
చెన్నై లోని అమరజీవి స్మారక సమితి వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా జనవరి నెల కార్యక్రమం ‘ పెండ్యాల – ఓ సంగీత స్వరనిధి ‘ ప్రసంగ కార్యక్రమ విశేషాలు,……
మనకి తెలిసినంతవరకు అన్నమాచార్యుడు మొట్టమొదటి ప్రజాకవి. అంటే తెలుగు భాషా వ్యవహార కవి అని చెప్పుకోవాలి. 15వ, 16వ శతాబ్దాల నాటి భాష, పలుకుబదులు, వ్యవహార విధానాలు, నిత్య జీవన సరళులు అన్నిటినీ కూడా పదాలుగా మలచి ప్రజల మనసులకి చేరువయ్యాడు.
శ్రీకృష్ణుని సౌందర్యముద్రామణి అనీరుక్మిణిదేవికి మణి భూషణమనీ గోపాలచూడామణీ అనీ చెబుతూ భక్తుల పాలిటికి త్రైలోక్యరక్షామణి ఇతడు అంటూ వర్ణిస్తారు శ్రీ కులశేఖరులు. అన్నమయ్య ఈ గోపాలదేవునే యశోద ముంగిట ముత్యంగాగొల్లెతల అరచేతి మాణిక్యంగా కాళింగుని తలపై పుష్యరాగంగా వర్ణిస్తూ కంసుని పాలిట వజ్రమైన ఈ దేవుడు మాకు గతియైన కమలాక్షుడు అంటూ వర్ణిస్తారు. ఏమి ఈ భక్తుల భావ సారూప్యం!