Instrument

13_008 మేలుకొలికే అద్భుతాలు

వాగ్గేయకారులైన అన్నమాచార్యులు, త్యాగరాజస్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ తమ కృతులతో పామరుల నుంచి జ్ఞానులను సైతం ఆలోచింపజేశారు. ఆధ్యాత్మిక, వాస్తవికత, సమాజహితం… ఇలా అన్ని అంశాలను మేళవించి ప్రతి హృదయాన్ని పులకింపజేశారు. అందుకే వారి కీర్తనలు ఎప్పటికీ మానవాళిని మేలుకోలుపుతుంటాయి. వారు రాగం, భావం, సంగీతం సమపాళ్లలో రంగరించడంవల్లే ఎప్పటికీ నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి.

13_007 రాగాల రాకుమారుడు

భాషలందు తెలుగు లెస్స
వంశపారంపర్య మహత్యమేమో నాకు మలయాళంతో పాటు తమిళం, హిందీ, కన్నడ, ఫ్రెంచ్, ఆంగ్ల బాషలు వచ్చు. సొంపైన తెలుగు సాంతంగా అర్ధమవుతుంది. తెలుగు మాటలలోని ప్రతి చివరి అక్షరం హల్లులతో కలిసి ఉంటుంది. ఉదాహరణకి ‘రాముడు’, ‘రామ’ అంటూ దీర్ఘం తీయటానికి ఎంతో సౌకర్యం.

13_006 నల్లని మేని నగవు చూపులవాడు ”…

శ్రీమతి భవ్య బేహత గారు అమెరికా చికాగో నగరంలో రెండు దశాబ్దాలుగా వీణ గాత్రం విద్యార్థులకి నేర్పుతున్నారు. బలమైన సంగీత సంప్రదాయాన్ని అమెరికా లో పటిష్ఠం చేస్తూ పాశ్చాత్య సంగీత కళాకారుల మన్ననలు పొందుతున్నారు. భవ్య బేహత డా. ఈమని కల్యాణి గారి నుండి ఈమని వీణా సంప్రదాయ పద్ధతి అభ్యసించి ప్రచారం చేస్తున్నారు. చికాగో “ రాగ ప్రభ “ అంతర్జాతీయ వీణా ఉత్సవాల సందర్భంగా అన్నమాచార్యుల వారి పద సంకీర్తనలు శిష్యులతో ప్రదర్శించారు.

13_006 ఆ ద్వయం అద్వితీయం

సంగీతం..

అదో ప్రపంచం. అభిరుచి, ఆసక్తి, కఠోర సాధన ఎంతో అవసరం. అన్నీ కలగలిస్తేనే రాణించగలరు. అలాంటిది ఒకే కుటుంబం నుంచి వచ్చి తమ అద్వితీయ ప్రతిభతో సంగీతాభిమానులను అలరిస్తున్నారీ ద్వయాలు. సంగీతోత్సవాలలో తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మైమరింపజేస్తున్నారు. అలాంటి వారిపై ప్రత్యేక కథనమిది.

13_003 నవవిధ భక్తి మార్గం

భగవంతుడిపై చూపే ప్రేమకే ‘ భక్తి ’ అని పేరు. దేవుడితో బంధం ఏర్పడేది బాహ్య క్రియలతో కాదు, మలినం లేని భక్తితోనే అని పురాణాలు చెబుతున్నాయి. భక్తుడు భగవంతుని చేరేందుకు ఉపయోగపడే సూత్రాలు పదకొండింటిని నారదుడు ఉపదేశించగా తదనంతరం అవి తొమ్మిదిగా క్రోడీకృతమయ్యాయి.
నిజానికి ఇవి భక్తి మార్గాలు కావు. భక్తికి తొమ్మిది మెట్లు లేక తొమ్మిది లక్షణాలుగా వేదవ్యాసుడు పేర్కొన్నారని ప్రముఖ సంగీత శాస్త్ర నిపుణుడు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు అంటారు.

13_002 ఆనాటి రాక్షస వీణ – వైయోలిన్

క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల నాటిది మన దేశంలోని ‘ రావణ హత్త ’ ఎటువంటి మార్పులూ లేకుండా అప్పటి ఆకార విశేషాలతోనే ఉన్న ఈ వాయిద్యం ఇప్పటికీ రాజస్తాన్, గుజరాత్ లలోని జనపదాల మధ్య మోగుతూ ఉండడం విశేషం. 22 అంగుళాల ఈ వాయిద్యం తయారీ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక కొబ్బరి చిప్పను మేక చర్మంతో కప్పి, వెదురుతో చేసిన దండితో కలుపుతారు. దీనిపై రెండు తీగలను బిగిస్తారు. ఒకటి గుర్రం వెంట్రుకతో చేసినది, ఇంకొకటి స్టీల్ తో చేసినది. అప్పట్లో నేటి రాజస్తాన్, గుజరాత్ లలోని రాజ్యాల యువరాజులకు మొట్టమొదట ఈ వాయిద్యం మీదే సంగీత శిక్షణనిచ్చేవారు. ఇదే వాయిద్యం తొమ్మిదో శతాబ్దంలో తూర్పు మధ్య దేశాలకు, యూరప్ కు చేరిందట. ఐరోపా దేశంలో దీన్ని ‘ రావణ స్ట్రాంగ్ ’ అని పిలిచేవారు. వైయోలిన్, వయోలా, గిటార్ వంటి పరికరాలు ఇందులో నుంచే క్రమంగా రూపుదిద్దుకున్నాయి.

12_011 అవధానం

అవధాన ప్రక్రియ అనేది ఒక విశేషమైన, విలక్షణమైన సాహితీ ప్రక్రియ. బహుశా ఈ ప్రక్రియ సంస్కృత భాషలో తప్ప మరే ఇతర భాషల్లోనూ లేదని చెప్పుకోవచ్చు. ఈ అవధాన ప్రక్రియలో విరివిగా చేసేది ‘ అష్టావధానం ’. ఈ అష్టావధానంలో కవికి ప్రధానంగా ఉండవల్సినది ‘ ధారణా శక్తి ’, సర్వంకషమైన పాండిత్యము, స్పురణ, లోకజ్ఞత. ఉపజ్ఞత, పాండిత్యము కలిగిన అవధాని యొక్క అవధానం మనోరంజకంగా ఉంటుంది.

12_010 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం

అనాదిగా భారతదేశం అనేక భాషలకి, వివిధ మతాలకి నిలయం. ఆయా మతాల్లో, భాషల్లో ఎందరెందరో వాగ్గేయకారులు తమ తమ సంగీతాన్ని పరిపుష్టి కావించి, నాదంతో పరమాత్మను చేరగలిగే బాటను అద్భుతంగా మలచి, మనకందించి తాము సర్వేశ్వరుని సాన్నిధ్యాన్ని అందుకున్నారు. ఈ మతాలన్నీ కూడా వేద ప్రతిపాదితమైన సనాతన ధర్మపు మూలసూత్రాల ఆధారంగానే రూపు దిద్దుకున్నాయి. జీవనది లాంటి భారతీయ ఆథ్యాత్మికత కాల పరీక్షకు నిలచి మనుగడ సాగిస్తూనే ఉంది.
తమ రచనల ద్వారా జన బాహుళ్యంలో ఆస్తిక భావన పెంపొందించిన మహానుభావులను, వారి రచనలను గురించి…..

11_003 నను బ్రోవమని చెప్పవే

ద్విభాష్యం నగేష్ బాబు గారి వీణ లో పలికించిన “ ది స్వర ఆఫ్ రామదాసు ” ఆల్బం నుంచి మిశ్రచాపు తాళం, కళ్యాణి రాగంలో రామదాసు కీర్తన “ నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి ” కుమారి లక్ష్మి అభినయంలో…..