Knowledge

13_008 మేలుకొలికే అద్భుతాలు

వాగ్గేయకారులైన అన్నమాచార్యులు, త్యాగరాజస్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ తమ కృతులతో పామరుల నుంచి జ్ఞానులను సైతం ఆలోచింపజేశారు. ఆధ్యాత్మిక, వాస్తవికత, సమాజహితం… ఇలా అన్ని అంశాలను మేళవించి ప్రతి హృదయాన్ని పులకింపజేశారు. అందుకే వారి కీర్తనలు ఎప్పటికీ మానవాళిని మేలుకోలుపుతుంటాయి. వారు రాగం, భావం, సంగీతం సమపాళ్లలో రంగరించడంవల్లే ఎప్పటికీ నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి.

13_007 సాక్షాత్కారము 10

కట్టియలపైకి చేరినకాయ మరరె!
కట్టియలతోడ తానును కాలిపోవు!
కట్టెలే వ్యర్థకాయముకన్న మేలు;
మంట పెట్టుటకై నను బనికివచ్చు!

13_006 సాక్షాత్కారము 09

ఎన్నో బెజ్జము లున్న తనువులో
గాలి నిలుచుటే ఆశ్చర్యం!
గాలిబ్రతుకు లివి రాలిపోవడం.
కానేకా దిది ఆశ్చర్యం!!

13_004 కార్తీక మాస ప్రాశస్త్యము

కార్తీక మాసము ప్రత్యేకంగా కుమారస్వామికి సంబంధించినదిగా పెద్దలు చెబుతారు. కృత్తికా నక్షత్రములో చంద్రుడు ఉంటుండగా పూర్ణిమ ఉండే మాసము కార్తీక మాసము. ఈ కృత్తికా నక్షత్రములు కార్తికేయునిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి లేక కుమారస్వామి యొక్క తల్లులుగా చెప్పబడుతాయి. ఆరు నక్షత్రముల గుంపు ఈ కృత్తికలు.

13_003 అన్నమాచార్య కళాభిజ్ఞత 18

రామాయణం త్రేతాయుగ కాలానికి చెందిన రామస్వామి వృత్తాంతం. మానసిక పరివృత్తికి, ధార్మిక ప్రవృత్తి కి, సుకర్మానురక్తికి మార్గం చూపగలిగే దివ్యమైన కావ్యము.
తేన వినా తృణమపి న చలతి
నీ సంకల్పమే లేకపోతే ఏదీ సాధ్యం కాదు. సర్వం రామ సంకల్పాధీనం అని ఎరిగిన అన్నమాచార్యులు రామకథ ని అత్యద్భుతంగా తన సంకీర్తనలలో రచించిన వాటికి కొన్ని ఉదాహరణలు….

13_002 అన్నమాచార్య కళాభిజ్ఞత 17

సూత సంహితలో ఒక దివ్యమైన శ్లోకం చెప్పుకుందాం.
” గీతి గానేనయోగస్యాత్ l యోగా దేవ శివైక్యతా
గీతిజ్ణ ఓ యది యోగేన l సయతి పరమేశ్వమ్ ll ”
సంగీతం ఒక దివ్యమైన సాధన. ఒక మహా యోగం.
ఆ మహా యోగ సాధన వలన జీవునికి బ్రహ్మపద ప్రాప్తి కలుగుతుంది.
సంగీత జ్ఞానము వలన ఐశ్వర్యము అంటే ఈశ్వర తత్వ సిద్ధి కలుగుతుంది
అని భావం .
ఇది లోతెైన విషయం, లౌకిక విషయం కాదు.

12_011 ముకుందమాల – భక్తితత్వం

ఈ శ్లోకాలలో మహారాజు తెలియజెప్పాలనుకున్నది భక్తి… భక్తి… భక్తి… ఇదొక్కటే మానవునికి ఇహపర సాధనం! ఇహలోకంలో దీని వలన లాభమేమిటీ అని ప్రశ్నించుకుంటే చాలా లాభమే ఉందీ అని చెప్పాలి. భక్తి వలన మనిషిలో సాత్విత భావం పెరుగతుంది. ఓర్పు, సహనం అలవడుతుంది. అంతేకాదు. భక్తికి ప్రధాన లక్షణం ప్రేమ, ‘‘అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు’’

12_010 ముకుందమాల – భక్తితత్వం

ఎవ్వనిచే జనించి, ఈ జగమెవ్వని లోపల నుండి, ఎవ్వని యందు లీనమగుచున్నదో, అతడే పరమేశ్వరుడూ, పరబ్రహ్మమూ అని చెబుతోంది ఉపనిషత్తు. అతడు శ్రీకృష్ణుడే! విత్తులో అణిగి వున్న చెట్టులా, సూక్ష్మంగా పరమాత్మలో అణగి ఉండి, సృష్టికాలంలో ఆ పరమాత్మ సంకల్పంతో, లేచి, విస్తరించేలా, శ్రీకృష్ణుని యందే ఈ సర్వజగత్తు ఉన్నది. ఆ కారణతత్వమే శ్రీకృష్ణ పరబ్రహ్మ.

12_009 ముకుందమాల – భక్తితత్వం

నామరసాయనం నీకు శక్తినిస్తుంది. ఆ నామస్మరణ భగవంతునికి దాసుని చేస్తుంది. అంటే ఇంక ఈ చంచలమైన మనసుకు నీవు దాసుడవు కావు అన్నమాట! అప్పుడే పరమాత్ముని గురించిన జ్ఞానం పరమాత్మకు దగ్గర చేస్తుంది. ఈ రసాయనం లోపలి కల్మషాన్ని కరిగించి బలాన్నిస్తుంది. అంతటి శక్తివంతమైనది నామ రసాయనం. నామం ఉంటే నామి ఉన్నట్లే. నామి తోడుంటే మనసుకు బలం, ధైర్యం. విష్ణు కథలు వింటే అర్ధం అవుతుంది. ఆ స్వామి అండ ఎంత బలమో!