Night

13_007 ఓం నమశ్శివాయః – హోళికా పూర్ణిమ

ఓం నమశ్శివాయః
మాఘమాసంలో బహుళ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటాము. క్షీరసాగర మధన సమయంలో భయంకరమైన హాలాహలం వెలువడింది, దాని నుంచి వెలువడుతున్న విషజ్వాలల వలన ప్రపంచమంతా నాశనం అయ్యే పరిస్తితి ఉత్పన్నమయింది. అప్పుడు దేవతలంతా శివుని ప్రార్థించారు. వారి ప్రార్థనకు కరిగిపోయి ఒక్క గుక్కలో ఆ హాలాహలాన్ని మింగేశాడు. ఆ విషం ఆయన గొంతు నుంచి క్రిందకు జారితే సమస్త విశ్వం ప్రమాదంలో పడుతుందని గ్రహించిన పార్వతి శివుని గొంతుని నొక్కిపెట్టి ఆ హాలాహలం క్రిందకు జరకుండా చూస్తుంది. దానివలన ఆయన కంఠం కమిలిపోయి నీల వర్ణానికి మారిపోవడంతో ‘ నీలకంఠుడు ’ అయ్యాడు. ఈ సంఘటన జరిగిన రోజే ‘ శివరాత్రి ’ పర్వదినం అయింది.

13_003 సర్వ కళా స్వరూపిణి

సర్వజగత్తు సృష్టించిన ఆ తల్లిలో ఎంత కవనమో ఉంది. ఎంత గానమో దాగిఉంది. జగత్ సృష్టికి మించిన కళ ఏమున్నది ? అంతకు మించిన శిల్పమేమున్నది ? ఆమెలో గోచరించని కళలేమి ఉన్నాయి ? సర్వకళా స్వరూపిణి ఆమె. వాణి ఆమె రూపమే. అందువలన నవరాత్రులలో ఒకనాడు ఆమెను సరస్వతిగా పూజిస్తారు.